ప్రశాంతంగా పోలింగ్, యూపీలో 54 శాతం.. ఉత్తరాఖండ్ లో 40 శాతం
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు యూపీలో 54 శాతం.. ఉత్తరాఖండ్ లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40 శాతం పోలింగ్ నమోదైంది.
ఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఏడు విడతలుగా యూపీలో ఎన్నికలు నిర్వహిస్తుండగా 67 స్థనాలకు రెండో విడత పోలింగ్ బుధవారం జరుగుతోంది.
మధ్యాహ్నం మూడు గంటల వరకు యూపీలో 54.27 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం 11 జిల్లాల్లో ఈ రోజు జరుగుతున్న పోలింగ్ లో 720 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. యూపీలోని మొరాదాబాద్ సమస్యాత్మక ప్రాంతం కావడం వల్ల ఇక్కడ భారీ సంఖ్యలో బలగాలను మోహరించారు.
ఇక ఉత్తరాఖండ్ లో 69 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, ఒక స్థానంలో అభ్యర్థి మరణించడంతో అక్కడ పోలింగ్ వాయిదా పడింది. ఉత్తరాఖండ్ ఎన్నికల్లో మొత్తం 628 మంది అభ్యర్థుల పోటీపడుతున్నారు.
ఇక్కడ జరుగుతున్న పోలింగ్ లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40 శాతం ఓటింగ్ నమోదైంది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి హరీశ్ రావత్ డెహ్రాడూన్ లోని ధర్మపూర్ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.