నెలలో చెప్తా: 'రాయ్చూర్' ప్రేమలో పడిన పూజాగాంధీ రీ ఎంట్రీ!
బెంగళూరు: ప్రముఖ నటి పూజా గాంధీ తన రాజకీయ ఆరంగేట్రం పైన మంగళవారం నాడు స్పందించారు. తాను ప్రస్తుతం రాజకీయాల్లో న్యూట్రల్ అని, త్వరలో తాను ఏ రాజకీయ పార్టీలో చేరేది చెబుతానని చెప్పారు.
తన చిత్రం ప్రమోషనల్ పర్యటనలో భాగంగా మంగళవారం రాజకీయాల పునరాగమనంపై మాట్లాడారు. తాను నెల రోజుల్లో ఏ పార్టీలో చేరేది చెబుతానని తెలిపారు.
తాను ప్రస్తుతం నిర్మాతగా, నటిగా బిజీగా ఉన్నానని చెప్పారు. తాను ఇప్పటికీ రాయచూర్ ప్రజలతో టచ్లోనే ఉన్నానని పూజా గాంధీ చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో మాట్లాడుతూ.. తాను ఓడినా, గెలిచినా రాయచూర్ ప్రజలు తన పట్ల చూపిన ఆదరణ మరిచిపోనని, రాయచూర్తో ప్రేమలో పడ్డానని చెప్పారు.
పూజా గాంధీ
పూజా గాంధీ తొలుత జనతా దళ్(ఎస్) పార్టీలో చేరారు. 18 జనవరి 2012లో ఆమె ఆ పార్టీలో చేరారు. ఆమెను యూత్ వింగ్కు వర్కింగ్ ప్రెసిడెంట్గా చేశారు. అనంతరం ఆమె ఆ పార్టీ నుండి బయటకు వచ్చారు.
పూజా గాంధీ
పూజా గాంధీ ఆ తర్వాత బీఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోను చేరారు. ఆ పార్టీ తరఫున కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు.
పూజా గాంధీ
ప్రముఖ నటి పూజా గాంధీ తన రాజకీయ ఆరంగేట్రం పైన మంగళవారం నాడు స్పందించారు. తాను ప్రస్తుతం రాజకీయాల్లో న్యూట్రల్ అని, త్వరలో తాను ఏ రాజకీయ పార్టీలో చేరేది చెబుతానని చెప్పారు.
పూజా గాంధీ
తన చిత్రం ప్రమోషనల్ పర్యటనలో భాగంగా మంగళవారం రాజకీయాల పునరాగమనంపై మాట్లాడారు. తాను నెల రోజుల్లో ఏ పార్టీలో చేరేది చెబుతానని తెలిపారు.