తమిళనాడు ఎన్నికలు: బిజెపిలోకి చెన్నై పవర్ స్టార్
చెన్నై: నటుడు, పవర్ స్టార్ శ్రీనివాసన్ భారతీయ జనతా పార్టీలో చేరారు. 'లతికా' చిత్రం ద్వారా కోలీవుడ్ దృష్టిని తనవైపు తిప్పుకున్న ఇతను 'కన్నా లడ్డు తిన్న ఆశైయా' తదితర పలు కామెడీ చిత్రాల్లో తన హాస్యంతో చాలామంది అభిమానులను సంపాధించుకున్నారు.
పలు వివాదాల్లో చిక్కుకుని తమిళ చిత్రసీమలో అవకాశాలను కొంచెం కొంచెం జారవిడుచుకున్న ఆయన కేంద్ర సహాయ మంత్రి పోన్ రాధాకృష్ణన్ సమక్షంలో సోమవారం బిజెపిలో చేరారు. ప్రస్తుత ఎన్నికల్లో బిజెపికి మద్దతుగా ప్రచారం చేయనున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు.

తమిళ పవర్ స్టార్ శ్రీనివాసన్ ఈ ఏడాది ప్రారంభంలో ఆర్సీ పాల్ కనగరాజ్ స్థాపించిన తమిళ్ మానిలా కచ్చి పార్టీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఇతను కొత్త పార్టీని స్థాపించి 2016 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారనే ఊహాగానాలు కూడా చెలరేగాయి.
శ్రీనివాసన్ తన కెరీర్ను మెడికల్ ప్రాక్టిషనర్గా ప్రారంభించారు. క్రమంగా సినీ రంగంలోకి ప్రవేశించారు. తానే నటుడిగా, సినిమాలు నిర్మించారు. ఆ తర్వాత 2014లో కన్నా లడ్డు తిన్న అశైయా సినిమా ద్వారా అతనికి మంచి బ్రేక్ వచ్చింది. దీంతో పలు ఆఫర్లు వచ్చాయి.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications