పదేపదే టార్గెట్, మరోసారి మోడీపై విరుచుకుపడ్డ నటుడు ప్రకాశ్ రాజ్
బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోడీపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి విరుచుకుపడ్డారు. ఇటీవల ఆయన పదేపదే మోడీని టార్గెట్ చేసుకుంటున్నారు. సింధనూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
పవన్ కళ్యాణ్ వచ్చినా ఏంకాదు, నా వద్ద కౌంటర్లు సిద్ధం: నటుడు సాయి కుమార్
ప్రధాని మోడీకి 2019 ఎన్నికల తర్వాత దేశంలో అంతగా పని ఉండదని, కర్నాటక వస్తే మా వాళ్లు కూర్చోబెట్టి కన్నడ భాష నేర్పిస్తారని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచార సభల్లో ఆ కన్నడ ప్రసంగం ఏమిటని విమర్శించారు.
రాష్ట్రంలో నాలుగైదు సభల్లో మోడీ మాట్లాడిన కన్నడ ప్రసంగాన్ని అనుకరించి చూపించారు. కాయగూరలు అమ్మినట్లు ఈ భాష ఏమిటని ప్రశ్నించారు.
నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని, నాకు ఏ భయమూ లేదన్నారు. బీజేపీ వాళ్లు నన్నేమీ చేయలేరన్నారు. బీజేపీ సునామీ వస్తోందని చెబుతున్నారని, సునామీలు దేశానికి ఏమైనా మంచివా అని ప్రశ్నించారు.
రాహుల్ గాంధీ వయస్సు ఎంత, మీ వయస్సు ఎంత మోడీ.. సిగ్గుగా లేదా అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఈ నెల 15వ తేదీన కర్నాటక ఎన్నికల ఫలితాలు చెబుతాయని, ఇక్కడ మీ ప్రతాపం ఎంత ఉందో తెలుస్తుందన్నారు. ఇక్కడి నుంచే బీజేపీ పతనం ఆరంభం అన్నారు.
Recommended Video
మరోవైపు, ప్రకాశ్ రాజ్ 'జస్ట్ ఆస్కింగ్' పేరుతో మోడీని ప్రశ్నించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేను సమాధానాలు పొందే వరకు ప్రశ్నలు వేస్తుంటానని ప్రకాశ్ రాజ్ చెప్పారు. మంచి పాలన కోసం ప్రజలు కూడా ఇలా చేయాలన్నారు. నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదన్నారు.