లోక్ సభ ఎన్నికల్లో పోటీ, నా ముఖం పగిలినట్లు అయ్యింది, నటుడు ప్రకాష్ రాజ్, పోరాటం చేస్తా !
బెంగళూరు: బెంగళూరు సెంట్రల్ లోక్ సభ నియోజక వర్గం నుంచి స్వంతత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రకాష్ రాజ్ ఎవ్వరూ ఊహించని విదంగా ఓటమిపాలైనారు. బెంగళూరు సెంట్రల్ లోక్ సభ నియోజక వర్గంలో పోటీ చేసిన ప్రకాష్ రాజ్ ప్రత్యర్థులకు గట్టిపోటీ ఇవ్వలేకపోయారు.
తన ఓటమి గురించి ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో స్పందించారు. స్వంతత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన తనకు ఈ ఫలితాలు ముఖం పగిలినట్లు అయ్యిందని ట్వీట్ చేశారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన తనకు మొదటి మొటిక్కాయ పడిందని ప్రకాష్ రాజ్ అంటున్నారు.
మండ్యలో సుమలత భారీ విజయం, సీఎం కుమారస్వామికి ఎదురు దెబ్బ, పరువు ప్రతిష్ట అంటే!
లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన తన పోరాటం మాత్రం ఆగదని ప్రకాష్ రాజ్ వివరించారు. సెక్యులర్ భారత్ కోసం చివరి క్షణం వరకు తాను పోరాటం చేస్తూనే ఉంటానని ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు. ప్రజల సమస్యల కోసం పోరాటం చేస్తానని ప్రకాష్ రాజ్ వివరించారు.
బెంగళూరు సెంట్రల్ లోక్ సభ నియోజక వర్గంలో బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ పీసీ మోహన్, కాంగ్రెస్ నుంచి రిజ్వాన్ అర్షద్, స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా నటుడు ప్రకాష్ రాజ్ పోటీ చేశారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రకాష్ రాజ్ కు కేవలం పది వేల ఓట్లు మాత్రం రావడంతో ఆయన కౌంటింగ్ కేంద్రం నుంచి మద్యలోనే వెళ్లిపోయారు.