వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Pranab Mukherjee Dead:దేశం గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయింది: జగన్, చంద్రబాబు సంతాపం..

|
Google Oneindia TeluguNews

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు. ఆయన మృతి జాతికి తీరని లోటు అని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి అభివర్ణించారు. గత ఐదు దశాబ్దాలుగా దేశం కోసం అలుపెరగకుండా కృషి చేశారని పేర్కొన్నారు. ప్రణబ్ ముఖర్జీ కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు సీఎం జగన్ ట్వీట్ చేశారు.

ప్రణబ్ ముఖర్జీ మృతి వార్త తెలిసి బాధేసిందని ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు. దేశం గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయిందని చెప్పారు. క్రమశిక్షణ, నిబద్ధతతో నమ్మిన సిద్దాంతాల కోసం వ్యుహాత్మకంగా పనిచేసిన గొప్ప యోధుడు ప్రణబ్ ముఖర్జీ అని తెలిపారు. అతని కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Pranab Mukherjee Dead:country loss great statesman: ap cm jagan

ప్రణబ్ మృతి వార్త కలచివేసిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. గొప్ప ఆర్థికవేత్త అని కీర్తించారు. అతని పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని ట్వీట్ చేశారు. ప్రణబ్ ముఖర్జీ మృతి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని ఏపీ హోంమంత్రి సుచరిత తెలిపారు. గత 5 దశాబ్దాలుగా దేశానికి అందించిన సేవలు మరువలేనివని.. వారి ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. కుటుంబసభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.

English summary
Pranab Mukherjee Passes Away:cuntry loss great statesman ap cm jagan mohan reddy, chandra babu naidu on pranab demise.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X