వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిశోర చాణక్యం : వైసీపీ విజయం కోసం స్ట్రాటజీస్, పాటలు, స్లోగన్లతో అట్రాక్ట్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : అతనో మేధావి. సాదాసీదా తెలివిమంతుడు కాదు .. ప్రజల నాడీ అంచనావేసి పార్టీలకు మేలు చేసే ఆక్టోపస్. అతను చెప్పినట్టు విన్నారో ఇక అంతే మీ ముందు పదవీ వచ్చి వాలుతుంది. అతనే ప్రశాంత్ కిశోర్. 2014లో మోదీని గద్దెనెక్కించింది. ఇప్పుడు ఏపీలో జగన్‌కు అధికారం కట్టబెట్టింది కిశోరే.

కిశోర చాణక్యం ..

కిశోర చాణక్యం ..

కిశోర్ చాణక్యాన్ని జగన్ తు.చ తప్పకుండా పాటించారు. ఎన్నికల్లో ప్రచార సరళి, అభ్యర్థుల ఎంపికను కూడా ఫాలో అయ్యారు. ఏపీలో .. అదీ చంద్రబాబు సీఎంగా ఉన్న ఇలాకాలో కిశోర్ చాణక్యం పనిచేయడమంటే సాధారణ విషయమేమి కాదు. ఆయన ఎత్తులతో వైసీపీ 151 స్థానాల్లో జయకేతనం ఎగరేసింది. అలాగే 22 లోక్ సభ సీట్లలో కూడా విజయం సాధించింది.

జగన్ రాజకీయ ఆరంగ్రేటం

జగన్ రాజకీయ ఆరంగ్రేటం

2009లో వైఎస్ఆర్ చనిపోయాక .. జరిగిన పరిణామాలతో జగన్ పార్టీ స్థాపించారు. 2009 నుంచి దాదాపు పదేళ్లపాటు ప్రజలతో మమేకమయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా తన వాణిని వినిపించారు. రాష్ట్ర విడిపోయాక జరిగిన ఎన్నికల్లో విపక్షంతో సరిపెట్టుకున్నారు. కానీ ఆ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పోటీచేయకపోవడంతో టీడీపీకి కలిసొచ్చింది. ఇక ప్రజలతో పాదయాత్ర, ప్రజా సంకల్ప యాత్ర పేరుతో మమేకమవుతూనే ఉన్నారు. గత ఎన్నికల్లో 45.4 శాతం ఓటు శాతంతో 66 సీట్లు సాధించగా .. 48.2 శాతం ఓటు షేర్ తో టీడీపీ 103 సీట్లు సాధించింది. దీంతో రంగంలోకి దిగిన ప్రశాంత్ కిశోర్ .. లూప్ హోల్స్ పై ఫోకస్ చేశారు. జగన్ ను బలోపేతం చేసేందుకు వ్యుహరచన చేశారు.

షా వ్యుహాలతో ..

షా వ్యుహాలతో ..

గతంలో అమిత్ షా అనుసరించిన వ్యుహన్ని ఏపీలో అమలు చేశారు. బూత్ స్థాయిలో కమిటీలు చేసి .. పార్టీని మరింత బలోపేతం చేశారు. ఇవి మంచి ఫలితాలిచ్చాయి. 2017లో బీహర్ లో జేడీయూ ఎలా అధికారంలోకి వచ్చిందో పరిశీలించి .. అంచనా వేసి ఏపీలో కూడా అదే విధానాన్ని అమలు చేశారు. అంతేకాదు 2012లో మొదటిసారి మోదీ సీఎం అయ్యేందుకు కూడా ప్రశాంత్ కిశోర్ సలహాలు, సూచనలు పనిచేశాయి. తర్వాతే 2014లో మోదీ వెన్నంటి ఉండి ... సోషల్ మీడియా క్యాంపెయిన్ చేశారు.

 ఒక టీం పనిచేసింది

ఒక టీం పనిచేసింది

ఏపీలో వ్యుహరచన కోసం ప్రశాంత్ కిశోర్ తన టీంనే రంగంలోకి దింపారు. ఏపీలో ప్రజలతో ప్రత్యక్షంగా కలుసుకొని అభిప్రాయం సేకరించారు. జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రలో తీసిన రావాలి జగన్, కావాలి జగన్ రూపకల్పన చేసింది కిశోర్ టీం. ఇది సోషల్ మీడియాలో ఎక్కువ చక్కర్లు కొట్టింది. దాదాపు 2.25 కోట్ల వ్యుహర్ షిప్ వచ్చింది. అదేవిధంగా మంచి మంచి స్లోగన్స్ కూడా ఇచ్చారు. ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకునేందుకు ఇవి పనిచేశాయి. దీంతో ప్రజలు చంద్రబాబును .. నిన్ను నమ్మను బాబు, బై బై బాబు అని తీర్పిచ్చారు. వాస్తవానికి టీడీపీ కూడా మల్లీ నువ్వే రావాలి అని జగన్ కు కౌంటర్ గా నినాదం ఇచ్చిన జనంలోకి అంతగా వెళ్లలేదు.

English summary
prashant Kishor is the man with the Midas touch in Indian elections turning almost every political entity that he has touched into gold. He has proved his mastery again propelling the YSR Congress of YSR Jagan Mohan Reddy to power with overwhelming majority and handing over a shocking defeat to tech-man politician N Chandrababu Naidu. The YSR Congress has won 22 of 25 Lok Sabha seats and more than 150 of 175 assembly segments in the polls. Jagan Mohan founded YSR Congress in 2011 breaking away from the Congress. His father YS Rajasekhara Reddy was the Andhra Pradesh CM when he died in a plane crash in 2009. The Congress chose to ignore Jagan Mohan's claim to Reddy Senior's legacy leading to his exit from the party. But he failed to win power in 2014 election in Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X