అబ్బే.. అదేం లేదే.. ఆదిత్యతో పనిచేయడంపై ప్రశాంత్ కిశోర్
న్యూఢిల్లీ : మీడియా వైఖరిని తప్పుపట్టారు రాజకీయ వ్యుహకర్త ప్రశాంత్ కిశోర్. తాను చేసే పనిని ఊహించి రాస్తోందని మండిపడ్డారు. శివసేన యువననేత ఆదిత్య ఠాక్రేతో కలిసి ప్రశాంత్ కిశోర్ పనిచేస్తున్నారని ఇటీవల ఓ పత్రికలో వార్త ప్రచురితమైంది. దీంతో ప్రశాంత్ కిశోర్ స్పందించారు.
తనకు మీడియా అంటే గౌరవం ఉందని పేర్కొన్నారు కిశోర్. కానీ సత్యదూరమైన వార్తలు విన్నప్పుడు బాధ అనిపిస్తోందని పేర్కొన్నారు. దీంతో మీడియా వైఖరి సెటైర్లు వేశారు. నిజం చెప్పాలంటే నేను ఎక్కడ పనిచేస్తున్నానో మీడియాకే తెలుస్తోందన్నారు. ఆయా విషయాలు పత్రికల్లో చూసి తెలుసుకోవాల్సి వస్తోందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీనిపై సోషల్ మీడియా ట్విట్టర్లో రియాక్టయ్యారు.
అక్టోబర్లో మహారాష్ట్రలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమలో శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్యతో ప్రశాంత్ కిశోర్ పనిచేస్తున్నారని వార్త గుప్పుమన్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆదిత్య జన ఆశీర్వాద్ యాత్ర పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. దీనిపై రుమార్లు వచ్చాయి. భారత రాజకీయ కార్యాచరణ కమిటీ పేరుతో టీం రన్ చేస్తోన్న కిశోర్ .. ఆదిత్యతో కలిసి పనిచేస్తున్నారనే ఊహగానాలను తప్పుపట్టారు.