పనిమనిషిని డబ్బు అడిగిన ప్రత్యూష, లాయర్ ట్విస్ట్
ముంబై: ముంబై: 'చిన్నారి పెళ్లి కూతురు' ఆనంది ఫేమ్ ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసులో మరో కొత్త కోణం వెలుగు చూసింది. ఆమె బ్యాంకు అకౌంట్లో డబ్బులు దండిగా ఉన్నా.. ఆమె తన అవసరాల కోసం డబ్బును తన ఇంటిలో పని చేసే వ్యక్తులను అడిగేదని తెలుస్తోంది.
ఈ షాకింగ్ విషయం తాజాగా వెలుగు చూసింది. మెడిసిన్స్ కొనేందుకు, క్యాబ్కు కిరాయి ఇచ్చేందుకు ఆమె ఇంట్లో పని చేసే పని మనుషులను డబ్బులు అడగవలసి వచ్చేదని తెలుస్తోంది. ప్రత్యూష అకౌంటులో డబ్బులు బాగా ఉన్నప్పటికీ పని వాళ్లను అడగవలసి రావడం గమనార్హం.
రేణు సిన్హా అనే మహిళ గత మూడు నెలలుగా ప్రత్యూష వద్ద పని చేస్తోంది. ప్రత్యూష ఉంటున్న ఇంట్లోనే రేను సిన్హా ఉంటోంది. ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్తో గొడవ నేపథ్యంలో ప్ర్తత్యూష బాధపడుతూ కనిపించేదని రేణు సిన్హా చెప్పింది. ప్రత్యూష తనను దీదీ అని పిలిచేదని చెప్పింది.
ఇదిలా ఉండగా, ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ మాజీ లాయర్ ప్రత్యూషకు మద్దతుగా నిలబడ్డారు. రాహుల్ రాజ్ మాజీ లాయర్ నీరజ్ గుప్తా తాజాగా ఆయనకు షాకిచ్చేందుకు సిద్ధమయ్యారు. విచారణ సరైన దిశలో సాగకుంటే రాహుల్ రాజ్కు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించారు.