వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: దుబాయ్ నుంచి వచ్చిన మహిళ, కడుపులోనే బిడ్డ మృతి, పొట్టన పెట్టుకున్నారు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/మంగళూరు: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బ వలన ఎవ్వరి ప్రాణాలు ఎలా పోతున్నాయో చెప్పడం సాధ్యం కావడం లేదు. లాక్ డౌన్ సందర్బంగా దుబాయ్ నుంచి భారత్ చేరుకున్న నిండు గర్బిణి కొందరు మూర్ఖుల వలన ఆమె కడుపులోనే బిడ్డను పోగుట్టుకుని ఆర్తనాదాలు చేసింది. కడుపులో బిడ్డ చనిపోవడంతో సరైన వైద్యం అందక ఆ మహిళ ఇప్పుడు మృత్యువుతో పోరాడుతున్నది. కడుపులో బిడ్డ చనిపోవడానికి మహిళ నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ నివాసులు, వైద్యులు కారణం అయ్యారని ఆరోపిస్తూ అధికారులు వారికి నోటీసులు జారీ చేశారు.

Lockdown: బ్యూటీ పార్లర్ ఆంటీ, బేకార్ ప్రియుడు, ఆ విషయంలో తేడా, ఇంట్లో భర్త లేని టైంలో ?Lockdown: బ్యూటీ పార్లర్ ఆంటీ, బేకార్ ప్రియుడు, ఆ విషయంలో తేడా, ఇంట్లో భర్త లేని టైంలో ?

 దుబాయ్ టూ మంగళూరు

దుబాయ్ టూ మంగళూరు

కర్ణాటకలోని మంగళూరుకు చెందిన మహిళ దుబాయ్ లో ఉంటున్నది. కరోనా వైరస్ లాక్ డౌన్ దెబ్బకు విదేశాల్లో ఉంటున్న వారు అక్కడే ఉండిపోయారు. మంగళూరుకు చెందిన ఆ మహిళ నిండు గర్బిణి. వందే భారత్ మిషన్ లో భాగంగా ఆ మహిళ మే 12వ తేదీన ప్రత్యేక విమానంలో మంగళూరు నగరానికి చేరుకుంది.

హోమ్ క్వారంటైన్ కు ఓకే

హోమ్ క్వారంటైన్ కు ఓకే

దుబాయ్ నుంచి మంగళూరు చేరుకున్న గర్బిణికి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు కరోనా వైరస్ చికిత్సలు చేశారు. మంగళూరులోని సొంత అపార్ట్ మెంట్ లో ఆ మహిళ హోమ్ క్వారంటైన్ లో ఉండటానికి ప్రభుత్వ అధికారులు, వైద్య శాఖ అధికారులు అనుమతి ఇచ్చారు.

కనికరం లేకుండా గెంటేశారు

కనికరం లేకుండా గెంటేశారు

గర్బిణి మహిళ నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ లో ఆమె ఉండటానికి అదే అపార్ట్ మెంట్ ఫ్లాట్స్ లో నివాసం ఉంటున్న వారు, అపార్ట్ మెంట్ అసోసియేషన్ కమిటీ నిర్వహకులు నిరాకరించారు. అపార్ట్ మెంట్ గేట్ లోపలకి ఆ మహిళను అనుమతించలేదు. చివరికి ఆ మహిళ ప్రైవేటు ఆసుపత్రిలోని క్వారంటైన్ లో ఉండటానికి ప్రయత్నించారు. అయితే ఏ ప్రైవేట్ ఆసుపత్రి సైతం ఆ మహిళకు చికిత్స చెయ్యడానికి నిరాకరించారు. తరువాత మహిళ ఓ ప్రైవేట్ హోటల్ లో ఉంటున్నది.

కడుపులోనే బిడ్డ ప్రాణం పోయింది

కడుపులోనే బిడ్డ ప్రాణం పోయింది

సొంత అపార్ట్ మెంట్ లో నివాసం ఉండటానికి అపార్ట్ మెంట్ అసోసియేషన్ కమిటీ నిర్వహకులు నిరాకరించడం, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చెయ్యడానికి నిరాకరించడంతో ఆ మహిళ నరకం అనుభవించింది. చివరికి ఆ మహిళ కడుపులో పెరుగుతున్న బిడ్డకు సరైన వైద్యం అందకపోవడంతో ఆ బిడ్డ కడుపులోనే చనిపోయిందని ఆమె అత్త విలపించారు.

 మృత్యువుతో పోరాడుతున్న తల్లి

మృత్యువుతో పోరాడుతున్న తల్లి

సరైన వైద్యం అందకపోవడం వలనే మహిళ కడుపులో బిడ్డ చనిపోయిందని, ప్రస్తుతం ప్రైవేటు హోటల్ లో తాము ఉంటున్నామని ఆ మహిళ అత్త వాపోయింది. కడుపులోనే బిడ్డ చనిపోవడంతో తల్లికి తీవ్రస్థాయిలో రక్తం పోయిందని, ఆమె కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడుతున్నదని ఆమె అత్త విలపిస్తున్నారు.

 నీచులకు నోటీసులు

నీచులకు నోటీసులు

మహిళ కడుపులోనే బిడ్డ చనిపోవడానికి అపార్ట్ మెంట్ అసోసియేషన్ నిర్వహకులు, ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు కారణం అయ్యారని తెలుసుకున్న మంగళూరు సిటీ కార్పోరేషన్ కమిషనర్ వారికి నోటీసులు జారీ చేశారు. దుబాయ్ నుంచి వచ్చిన మహిళ కారణంగా తమకు ఎక్కడ కరోనా వైరస్ సోకుతుందో అనే భయంతో వారు ఇక్కడ నివాసం ఉండటానికి తాము నిరాకరించామని అపార్ట్ మెంట్ అసోసియేషన్ నిర్వహకులు అంటున్నారు.

English summary
Coronavirus: A pregnant woman who arrived in Mangalore on a Vande Bharat flight was allegedly denied entry into her apartment by the residents’ association.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X