దారుణం: గర్భిణిపై సర్పంచ్ కొడుకు అత్యాచారం
భోపాల్: మానవత్వాన్ని మరిచిన ఓ కామాంధుడు గర్భిణిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సభ్య సమాజం తలదించుకునే ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఛట్టర్పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఐదురోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తర్పూర్ జిల్లాలోని బార్ట్ అనే గ్రామ సర్పంచ్ కొడుకు వారి ఇంట్లో పని చేసే ఐదు నెలల గర్భిణిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అతడు పరారయ్యాడు.
ఐదుగురు పిల్లల తల్లి అయిన గర్భిణి(35)పై సర్పంచ్ కొడుకు అజయ్ రాజ్పుత్ అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.
పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు నౌగాన్ పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ డిడి ఆజాద్ శుక్రవారం తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.