వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎవరీ నెస్ వాడియా?: ప్రీతిజింతా ఫిర్యాదు, సాక్ష్యులు..

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: తన మాజీ ప్రియుడు నెస్ వాడియా పైన బాలీవుడ్ నటి ప్రీతిజింతా కేసు పెట్టిన విషయం తెలిసిందే. నెస్ వాడియా.. పాకిస్థాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నా ముని మనవడు.. వాడియాలది వ్యాపారవేత్తల కుటుంబం. ఒకప్పుడు భారతీయ వస్త్ర సామ్రాజ్యాన్ని గుప్పిట పెట్టుకున్న బాంబే డయింగ్‌తో సహా బ్రిటానియా, గోఎయిర్ వంటి సంస్థల్లో వాడియా గ్రూప్ భాగస్వామి.

ప్రస్తుతం బొంబాయి బర్మా ట్రేడింగ్ కార్పొరేషన్ ఎండీగా, బాంబే డయింగ్ జేఎండీగా నెస్ వ్యవహరిస్తున్నారు. 44 ఏళ్ల నెస్ అవివాహితుడు. 2005 నుంచి 2009 వరకు నెస్ బాలీవుడ్ నటి ప్రీతి జింటాతో కలిసి సహజీవనం చేశారు. వీరిద్దరూ పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టుకు సహ యజమానులుగా ఉన్నారు.

Preity case: cops identify two witnesses

కాగా, ప్రీతిజింతా ఆరోపణల నేపథ్యంలో ముంబై పోలీసులు ఇద్దరు సాక్ష్యులను గుర్తించినట్లుగా తెలుస్తోంది. వాంఖేడే స్టేడియంలో మే 30న తనను నెస్ వాడియా వేధించారని ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిను ముంబై పోలీసులు ఇద్దరు సాక్ష్యులను గుర్తించారు.

కాగా, నెస్ వాడియాతో విడిపోయిన తర్వాత ప్రీతి జింతా పలు సినిమాలకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించారు. ఆమె చివరిగా నిర్మించిన ఇష్క్ ఇన్ ప్యారిస్ బాక్సాఫీసు వద్ద దారుణంగా దెబ్బతినింది. ఈ సినిమా దర్శకుడు అబ్బాస్‌కు ఇవ్వాల్సిన మొత్తాన్ని చెల్లించకపోవడంతో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆమె నెస్ వాడియా పైన ఫిర్యాదు చేశారన్న ఆరోపణలూ ఉన్నాయి.

English summary
Mumbai police on Saturday identified two people who allegedly saw Bollywood actor and Kings XI Punjab co-owner Preity Zinta abused and molested by her former boyfriend and industrialist Ness Wadia at the Wankhede Stadium on May 30.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X