మాజీ ప్రియుడి కేసు: ముంబైకి ప్రీతి, నిజమని సాక్షులు!
ముంబై: మాజీ ప్రియుడు పైన వేధింపుల కేసు పెట్టిన ప్రముఖ బాలీవుడ్ నటి ప్రీతిజింతా ఆదివారం అమెరికా నుండి ముంబైకి తిరిగి వచ్చారు.
ఆమె ఈ కేసులో సోమవారం ముంబై పోలీసుల ఎదుట వాంగ్మూలం ఇవ్వనున్నారు. ఇప్పటికే పోలీసు బృందం ఒకటి ప్రీతి ఫిర్యాదు చేసిన సంఘటన తాలుకు సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తోంది.
ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా గ్యాలరీలో ఉన్న తనను నెస్ వాడియా తీవ్రంగా దుర్భాషలాడాడని ప్రీతిజింతా పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ప్రీతిజింతా - నెస్
ప్రముఖ బాలీవుడ్ నటి ప్రీతిజింతా, వ్యాపారవేత్త ప్రీతిజింతా మధ్య కొద్దికాలంగా వేధింపుల వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ముంబై పోలీసులు ప్రీతి స్టేట్మెంట్ను సోమవారం రికార్డ్ చేయనున్నారు.
ప్రీతిజింతా - నెస్
ముంబైలోని వాంఖేడే స్టేడియంలో తనను తన మాజీ ప్రియుడు వేధించాడని ప్రీతిజింతా కొద్ది రోజుల క్రితం ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రీతిజింతా - నెస్
ముంబైలోని వాంఖేడే స్టేడియంలో తనను తన మాజీ ప్రియుడు వేధించాడని ప్రీతిజింతా కొద్ది రోజుల క్రితం ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తాను వేధించలేదని నెస్ చెబుతున్నారు.
ప్రీతిజింతా - నెస్
మరోవైపు, ప్రీతిజింతా - నెస్ వాడియా కేసులో ఐదుగురు సాక్ష్యులను పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. పోలీసులు ఏడుగురిని విచారించారు. అందులో ఐదుగురు వేధింపులు నిజమేనని చెప్పినట్లుగా తెలుస్తోంది.