వ్యక్తిగత విషయాలడగటం అంత మంచిది కాదు: ప్రీతి జింటా
ముంబై: బాలీవుడ్ నటి, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు యజమాని ప్రీతి జింటా ఓ మహిళా జర్నిలిస్ట్పై మండిపడింది. వివరాల్లోకి వెళితే ఓ ప్రైవేటు కార్యక్రమానికి వచ్చిన ప్రీతి జింటాను ఆ మహిళా జర్నలిస్ట్ కొన్ని వ్యక్తిగత విషయాలకు సంబంధించిన ప్రశ్నలు అడగటమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
అనంతరం ఆమెతో 'మహిళగా ఉండటానికి ప్రయత్నించు... మంచి జర్నలిస్ట్'గా కాదని చెప్పినట్లు సమాచారం. దీంతో ప్రీతి జింటా అసలు తనపై ఎందుకంతలా మండిపడిందో అర్ధంకాక ఆ మహిళా జర్నలిస్ట్ నిశ్చేష్టురాలైంది.
ప్రీతి జింటా, టీమిండియా ఆటగాడు యువరాజ్ సింగ్తో ఏకంగా సహజీవనం చేస్తోందని మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. బహుశా ఈ వార్తలపై ఆ మహిళా జర్నలిస్ట్ ప్రీతి జింటాను అడిగి ఉండొచ్చు. గతంలో మాజీ ప్రియుడు నెస్ వాడియాతో వివాదం చెలరేగినప్పుడు ప్రీతి చాలా ఒత్తిడికి గురైంది.
ఆ సమయంలో ఈ అందాల భామకు యువరాజ్ సింగ్ ఆపన్నహస్తం అందించాడట. అండగా నిలబడి, ఆత్మస్థైర్యాన్ని నింపాడట. ఈ నేపథ్యంలో, వీరిద్దరి మధ్య బంధం బలపడి, ప్రేమకు దారితీసిందని తెలుస్తోంది. కాగా నెస్ వాడియా తనను వేధించాడని ఆరోపిస్తూ ప్రీతి జింటా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.