బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లేడీ టెక్కీ ఆత్మహత్యకు ఇవే అసలుకారణాలు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కార్యాలయం కట్టడం మీద నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్ వేర్ ఇంజనీరు శోభా (30) ఆత్మహత్య కేసు దర్యాప్తులో పలు సాక్షాలు సేకరించామని విచారణ చేస్తున్న పోలీసు అధికారులు తెలిపారు.

మండ్యకు చెందిన శోభా చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో కష్టపడి విద్యాభ్యాసం చేసింది. తరువాత సాఫ్ట్ వేర్ ఇంజనీరు అయిన శోభా తల్లితో కలిసి బెంగళూరులోనే నివాసం ఉంటున్నది.

<strong>షాక్: బెంగళూరులో ఆఫీస్ మీద నుంచి దూకి లేడీ టెక్కీ ఆత్మహత్య</strong>షాక్: బెంగళూరులో ఆఫీస్ మీద నుంచి దూకి లేడీ టెక్కీ ఆత్మహత్య

Preliminary inquiries revealed that Shobha was having a dispute with her relatives over property,

ఇక్కడి వైట్ ఫీల్డ్ లోని హార్యాన్ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న శోభా కుటుంబ సమస్యలతో విసిగిపోయిందని ఆమె తల్లి చెప్పారని పోలీసు అధికారులు అన్నారు. మండ్యలో శోభా తండ్రి పేరు మీద ఆస్తులు ఉన్నాయి.

తండ్రి మరణించిన తరువాత ఇప్పటి వరకు శోభా కుటుంబ సభ్యులకు ఆ ఆస్తులు ఇవ్వలేదు. ఆస్తుల పంపకంలో గత కొన్ని సంవత్సరాల నుంచి బంధువులతో శోభాకు వివాదం ఉందని, కోర్టులో కేసులు విచారణలో ఉన్నాయని పోలీసు అధికారులు తెలిపారు.

ఇదే కారణంతో జీవితంపై విరక్తి చెందిన శోభా గురువారం ఆమె పని చేస్తున్న కార్యాలయం నాలుగవ అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుందని, ప్రాథమిక విచారణలో ఆస్తుల గొడవ విషయం వెలుగు చూసింది పోలీసు అధికారులు తెలిపారు.

English summary
Preliminary inquiries revealed that Shobha was having a dispute with her relatives over property, which is in court, and was under depression. She was consulting a psychiatrist, police said, quoting family sources.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X