యువత అవసరాలు, ఆకాంక్షలను నేరవేర్చడంలో ఎన్ఈపీ 2020 దోహదపడుతుంది: రాష్ట్రపతి
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యావిధానంపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీలు ఆయా రాష్ట్ర గవర్నర్ల సదస్సులో ప్రసంగించనున్నారు. రోల్ ఆఫ్ ఎన్ఈపీ -2020 ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ హైయర్ ఎడ్యుకేషన్ పేరుతో ఈ ఆన్లైన్ కాన్ఫరెన్స్ జరగనుంది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర విద్యాశాఖ నేతృత్వంలో జరుగనుంది. దాదాపు 34 ఏళ్ల తర్వాత విద్యావిధానంలో సంస్కరణలు తీసుకొస్తూ కొత్త విధానం రూపొందించడం ఇదే తొలిసారి కావడం విశేషం. అంతకుముందు 1986లో విద్యావిధానం రూపొందించడం జరిగింది. ఇక నూతన విద్యా విధానం 2020లో భారీ సంస్కరణలు చేపట్టారు. ఇక గవర్నర్ల కాన్ఫరెన్స్లో రాష్ట్రపతి ప్రధాని ప్రసంగం లైవ్ అప్డేట్స్ మీకోసం
President Ram Nath Kovind, Prime Minister Narendra Modi and Education Minister Ramesh Pokhriyal participate via video conference in the Governor's Conference on New Education Policy. pic.twitter.com/Iytu0wBZur
— ANI (@ANI) September 7, 2020