చావో రేవో: సిందియాకు ప్రెస్టేజ్ ఇష్యూగా మారిన ఎమ్మెల్యేల విజయం..
మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అయితే మొత్తం 28 స్థానాలకు ఉప ఎన్నిక జరుగుతుండగా 22 మంది జ్యోతిరాదిత్య సింధియా వర్గం ఎమ్మెల్యేలు రాజీనామాతో ఎన్నిక అనివార్యమైంది. అయితే వారిని తిరిగి ఎన్నుకోవడం సింధియా ప్రెస్టిజ్ ఇష్యూగా మారింది. ఇందులో 16 సీట్లు గ్వాలియర్, చంబల్ ప్రాంతంలో ఉన్నాయి. ఇవీ సింధియా కుటుంబానికి పెట్టిన కోటలు.. అయితే ఆయా చోట్ల పార్టీ మారడంతో ఓటర్లు ఏ మేరకు ప్రభావం చూపారనే అంశం ఇవాళ తేలనుంది.
Recommended Video
సింధియా వర్గం రాజీనామా చేయడంతో మధ్యప్రదేశ్లో ప్రభుత్వం పడిపోయింది. కమల్ నాథ్ సీఎం పదవీకి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ ఎన్నికల్లో సాధించే సీట్లను బట్టి శివరాజ్ సింగ్ చౌహన్ ప్రభుత్వ మనుగడ ఆధారపడి ఉంటుంది. అయితే ప్రచారంలో మాజీ సీఎం కమల్ నాథ్ నోటిదురుసు ప్రదర్శించారు. మాజీమంత్రిపై చేసిన ఐటెమ్ కామెంట్ దుమారం రేపింది. దీంతో ఎన్నికల సంఘం కూడా కలుగజేసుకొంది. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ నుంచి తొలగించింది. అయితే ఈసీ ఆదేశాలను సుప్రీంకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే.