దారుణం: ప్రార్థన కోసం వచ్చిన అమ్మాయిని.. చర్చ్ ఫాదర్ ఏం చేశాడంటే...
గీత్ కుమార్ సోమనాథ్ పిళ్లై అలియాస్ మణికుట్టన్ (40) ఉల్లాస్ నగర్ లోని ఓ చర్చ్ లో ఫాదర్ గా పనిచేస్తున్నాడు. పదో తరగతి చదువుతున్న ఓ అమ్మాయి చర్చ్ లో ప్రార్థన చేసేందుకు రెండేళ్లుగా వస్తోంది.
ఉల్లాస్నగర్ : ప్రార్థన చేసేందుకు చర్చ్ కు వచ్చిన ఓ అమ్మాయిపై మరో భక్తురాలి సహాయంతో ఓ చర్చ్ ఫాదర్ అత్యాచారం జరిపిన దారుణ ఘటన ముంబై నగరంలోని ఉల్లాస్ నగర్ లో వెలుగుచూసింది.
హై ప్రొఫైల్ సెక్స్ రాకెట్ గుట్టురట్టు.. ఇద్దరి అరెస్టు, ముగ్గురు బాలికలకు విముక్తి
యువతి స్నానం చేస్తుండగా చిత్రీకరిస్తూ అడ్డంగా దొరికిన యువకుడు
గీత్ కుమార్ సోమనాథ్ పిళ్లై అలియాస్ మణికుట్టన్ (40) ఉల్లాస్ నగర్ లోని ఓ చర్చ్ లో ఫాదర్ గా పనిచేస్తున్నాడు. పదో తరగతి చదువుతున్న ఓ అమ్మాయి చర్చ్ లో ప్రార్థన చేసేందుకు రెండేళ్లుగా వస్తోంది.
చర్చ్ లో ఉన్న ఓ మహిళా భక్తురాలు ఒకరోజు ఆ అమ్మాయిని తీసుకువెళ్లి చర్చ్ ఫాదర్ కు పరిచయం చేసింది. అమ్మాయిని గదికి తీసుకువెళ్లిన ఫాదర్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు, ఆ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేస్తూ గత రెండేళ్లుగా ఫాదర్ అత్యాచారం చేస్తున్నాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.
అదే చర్చ్ కు వస్తోన్న మరో మహిళకు ఆ అమ్మాయి పట్ల చర్ఛ్ ఫాదర్ ప్రవర్తనపై అనుమానం వచ్చింది. విషయాన్ని ఆమె బాధితురాలి తల్లి దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఆ అమ్మాయిని తల్లి నిలదీసింది.
చర్ఛ్ ఫాదర్ తనపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడని, గత రెండేళ్లుగా ఇది జరుగుతోందని ఆ అమ్మాయి తల్లి ఎదుట చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో ఆ అమ్మాయి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు చర్చ్ ఫాదర్ మణికుట్టన్ తోపాటు ఈ అత్యాచార ఉదంతంలో అతడికి సహకరించిన సదరు మహిళా భక్తురాలిని పోలీసులు అరెస్టు చేశారు.