వర్షాల కోసం విన్నూత్న పూజలు... నీళ్ల గిన్నేలో కూర్చుని మంత్రాలు...!
జూన్ మొదటి వారం దాటి, రెండవ వారంలోకి అడుగుపెడుతున్నా... వర్షలు కురిసేందుకు వెనకడుగు వేస్తున్నాయి. వర్షలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు అంతా ఇంతా కాదు, వీటికి తోడు వడగాడ్పులతో రోడ్లపైకి వచ్చేందుకు జంకుతున్న పరిస్థితి దీంతో వర్షాలకోసం పలు ఆలయాల్లో పూజలు కొనసాగుతున్నాయి. ఇందుకోసం రకరకాల పూజలు చేస్తున్నారు పలువురు పూజారులు... ఈనేపథ్యంలోనే బెంగళూరులోని పూజారులు వినూత్నంగా పూజలు చేశారు. అయితే వారి పూజ విధానం నెటిజన్లకు నవ్వు తెప్పిస్తుంది.
రాష్ట్రానికి నలుగురు కొత్త ఐపీఎస్లను కేటాయించిన కేంద్రం
బెంగళూరులోని పూజారులు వర్షాలు కురిసేందుకు విన్నూతంగా పూజా కార్యక్రమాన్ని చేపట్టారు. నగరంలోని హల్సూరు ప్రాంతంలో ఉన్న సోమేశ్వర టెంపూల్లో వర్షాల కోసం పూజలు చేశారు. అయితే ఇందుకోసం ఇద్దరు పూజారులు పెద్ద నీళ్ల గిన్నేలో కూర్చుని ఫోన్లో మంత్రాలు పటిస్తూ పూజను కోనసాగించారు. మరోవైపు హోమం కొనసాగిస్తూ ఇంకోవైపు నీళ్లగిన్నేలో కూర్చుని మంత్రాలు చదవడం పలువురి నెటిజన్లకు నవ్వు తెప్పిస్తుంది. కాగ వర్షాల కోసం హోమాలు చేయడం.. తెలుగు రాష్ట్ర్రాలతో పాటు దక్షిణాది రాష్ట్ర్రాల్లో కప్పతల్లులను ఆడడం కూడ చేయడం మనకు తెలిసిందే..కాని ఈవిధంగా వరుణదేవుడి కరుణ కోసం నీళ్లల్లో కూర్చుని పూజలు చేయడంతో కాస్త భక్తి మాట ఎలా ఉన్నా చూసే వారికి మాత్రం కాస్త హ్యుమరస్గా పూజారులు పూజా విధానం కనిపిస్తుంది.
అయితే ఫోన్లను విన్నూత్న పద్దతిలో వాడుతున్నారని , నీళ్లలో ఎందుకు కూర్చున్నారని మరోకరు , అసలే నీళ్ల కరువు ఉంటే ఉన్న నీళ్లను వేస్ట్ చేస్తున్నారని మరోకరు ఇలా రకారకాలుగా కామెంట్లు పెట్టారు నెటిజన్లు,