మిస్సైల్ మ్యాన్ కలాం: ప్రధాని ఓదార్పు (వీడియో)
రామేశ్వరం: భారతరత్న, భరతమాత ముద్దు బిడ్డ మిస్సైల్ మ్యాన్ కలాంకు కడసారిగా విడ్కోలు పలికారు. మాతృభూమి నుండి ఆయన అందరిని వదలి శాస్వతంగా సెలవు తీసుకున్నారు. శారీరకంగా ఆయన దూరం అయినా ఆయన జ్ఞాపకాలు సజీవంగా వదిలి వెళ్లారు.
గురువారం మద్యాహ్నం 12 గంటల సమయంలో ముస్లీం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆ ప్రక్రియ పూర్తి అయిన తరువాత అబ్దుల్ కలాం పార్థివ దేహాన్ని ఖననం చేశారు. వేలాది మంది అభిమానులు కలాంకు కన్నీటితో వీడ్కోలు పలికారు.
సోంతగడ్డపైనే తన అంతిమ సంస్కరాలు పూర్తి చెయ్యాలని కలాం చెప్పిన మాటలు నిజం అయ్యాయి. ఆయన సోంతగడ్డ రామేశ్వరంలోనే ప్రభుత్వ లాంచానాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. ప్రముఖ రాజకీయ నాయకులతో పాటు వీఐపీలు, పెద్ద ఎత్తున శాస్త్రవేత్తలు అంత్యక్రియలకు హాజరైనారు.
అంత్యక్రియలకు హాజరైన భారత ప్రధాని నరేంద్ర మోదీ కలాం కుటుంబ సభ్యులను ఓదార్చారు. మీకు అండగా మేము ఉంటామని ధైర్యం చెప్పారు. కలాం దేశానికి అందించిన సేవలను గుర్తు పెట్టుకున్నామని, మీకు అన్ని విధాలుగా అండగా ఉంటామని మోదీ కలాం కుటుంబ సభ్యులకు హామి ఇచ్చారు.