ప్రధాని మోడీకి గేట్స్ ఫౌండేషన్ అవార్డ్...
ప్రధాని నరేంద్రమోడీ మానస పుత్రిక అయిన స్వఛ్చభారత్ అభియాన్ మరో అవార్డు స్వంతం చేసుకుంది. ఇప్పటికే పలు దేశాల ప్రశంశలు అందుకుంటున్న స్వచ్చభారత్ అభియాన్కు ప్రముఖమైన బిల్ అండ్ మిలింద్ గేట్స్ ఫౌండేషన్ అవార్డును ప్రకటించింది. కాగా ఈ అవార్డును వచ్చె నెల అమేరికా వెళ్లనున్న ప్రధాని నరేంద్ర మోడీ అందుకోనున్నారు.
కేంద్రంలో ప్రధాని మోడీ ప్రారంభించిన కొన్ని ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో స్వచ్ఛ భారత్ అభియాన్, అక్టోబర్ 2 న మహాత్మా గాంధీ తన జన్మదినం సందర్భంగా ఈ ప్రాజెక్ట్ ప్రారంభించబడింది. 2014 ఆక్టోబర్ 2 ప్రారంభించబడిన స్యచ్చ భారత్ అభియాన్ పలు దేశాల ప్రశంశలు అందుకోంటుంది. స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమం ద్వార 2019 నాటికి భారతదేశాన్ని 'బహిరంగ మలవిసర్జన రహితంగా' మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగానే 9 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణానికి 5 సంవత్సరాల కాలంలో నిర్మించాలని దీని లక్ష్యం.
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మరియు అతని భార్య మెలిండా గేట్స్ యాజమాన్యంలోని ఒక ప్రైవేట్ ఫౌండేషన్ అయిన బిల్ అండ్ గేట్స్ ఫౌండషన్ అవార్డును ప్రకటించింది.కాగ గతంలో కూడ ఆధార్తో పాటు మోడీ ప్రవేశపెట్టిన ఆయూష్మాన్ భారత్ పథకానికి కూడ బిల్గేట్స్ మోడీని ప్రంశసించారు. ఈ నేపథ్యంలోనే మోడీ తన యూఎస్ పర్యటన సంధర్భంగా గేట్స్ ఫౌండేషన్ ప్రకటించిన అవార్డును అందుకోనున్నట్టు మినిస్టర్ ఫర్ స్టేట్స్ జితెందర్ సింగ్ తెలిపారు.
Another award,another moment of pride for every Indian, as PM Modi's diligent and innovative initiatives bring laurels from across the world.
— Dr Jitendra Singh (@DrJitendraSingh) September 2, 2019
Sh @narendramodi to receive award from Bill & Melinda Gates Foundation for #SwachhBharatAbhiyaan during his visit to the United States. pic.twitter.com/QlsxOWS6jT