శక్తిమంతమైన 30 మందిలో ఒబామా ఫస్ట్, ప్రధాని మోడీ సెకండ్
న్యూయార్క్: షోషల్ మీడియాలో అత్యంత శక్తివంతమైన 30మందిలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, భారత ప్రధాని నరేంద్ర మోడీ వరుసగా మొదటి, రెండవ స్థానం సంపాదించారు. న్యూయార్క్లోని టైమ్స్ మేగజైన్ ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రపంచంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు షోషల్ మీడియాలో ఫేస్బుక్, ట్విట్టర్లు నిర్వహిస్తున్నారు. వారిని ఎంతమంది అనుసరిస్తున్నారు, వారి ప్రభావం ప్రజల మీద ఎంత ఉందని అని సర్వే చేసింది.
టైమ్స్ నిర్వహించిన సర్వేలో అమెరికా అధ్యక్షుడు ఒబామా మొదటి స్థానంలో ఉన్నారు. ప్రపచంలో చాలామందిలో ఒబామ నిత్యం షోషల్ మీడియాలో టచ్లో ఉన్నారని, ప్రజల అభిమానం పోందుతున్నారని చెప్పారు. ఆ తర్వాత స్థానంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారు. ప్రధాని మోడీ షోషల్ మీడియాలో ట్విట్టర్, ఫేస్ బుక్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
నిత్యం భారత ప్రధాని నరేంద్ర మోడీని షోషల్ మీడియాలో అనుసరిస్తున్న వారి సంఖ్య 3 కోట్ల 80 లక్షల మంది ఉన్నారని టైమ్స్ వెల్లడించింది. ఈ 30 మంది శక్తివంతమైన వారిలో వివిద రంగాలకు చెందిన వారు ఉన్నారు.
సంగీత దర్శకుడు టైలర్ స్టీఫ్ట్, హ్యారిపోట్టర్ సిరీస్ రచయిత జికే రౌలింగ్ షోషల్ మీడియాలో అనేక మందితో టచ్లో ఉన్నారు. సంగీత దర్శకుడు జస్టిన్ బైబర్, గాయకురాలు షకీరా, హాలీవుడ్ నటుడు గైనెట్ పలట్రో, చైనా నటుడు యో చీన్, టీవీ యాంకర్ జిమ్మి ఫాలోన్, ఫోటోగ్రాఫర్ హుగేలి తదితరులు ఈ 30 మంది జాబితాలో స్థానం సంపాదించుకున్నారు.