అరుణ్ జైట్లీ ఇంటికి వెళ్లిన ప్రధాని నరేంద్రమోడీ, చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు
ప్రధాని నరేంద్ర మోడీ ,ఇటివల మృతిచెందిన బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్టీ ఇంటికి వెళ్లి అయన కుటుంభసభ్యులను పరామర్శించారు. అనంతరం అరుణ్ జైట్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అరుణ్ జైట్లి మృతి చెందిన సమయంలో మోడీ జీ7 దేశాల సదస్సులో భాగంగా ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు. విదేశీ పర్యటన ముగించుకుని రాత్రీ డిల్లీకి చేరుకున్నారు.
నేడు ఉదయమే జైట్లి ఇంటికి చేరుకున్న ప్రధాని నరేంద్రమోడి జైట్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంభసభ్యులను పరామర్శించారు. కాగా గత కోంతకాలంగా అనారోగ్యంతో డిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న అరుణ్ జైట్లి గత శనివారం మధ్యహ్నాం మృతి చెందారు.
అయితే విషయం తెలుసుకున్న ప్రధాని తిరిగి దేశానికి వచ్చేందుకు సిద్దమయ్యారు. ఈ సంధర్భంలోనే మోడీ జైట్లి కుటుంభ సభ్యులకు ఫోన్ చేశారు. దీంతో వారు విదేశీ పర్యటన ముగించుకున్న తర్వాతే ఇండియాకు తిరిగి రావాలని అరుణ్ జైట్లీ భార్య ఫోన్లో సూచించింది. దీంతో ఆయన ఇండియాకు తిరిగి రాకుండా అక్కడే అరుణ్ జైట్లికి నివాళులు అర్పించారు. అనంతరం తాను విలువైన మిత్రుడిని కోల్పోయానని పేర్కోన్నారు. ప్రధానితో పాటు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా వెంట ఉన్నారు.
Delhi: Prime Minister Narendra Modi met the family of late former Union Finance Minister #ArunJaitley at his residence, today. pic.twitter.com/zIhsWPogyl
— ANI (@ANI) August 27, 2019