గయ బుద్ధుని సన్నిధిలో ధ్యానం చేసిన మోడీ
గయ: కృష్ణాష్టమి పర్వదినం రోజున భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బీహార్ లోని బుద్ధ గయలో ప్రసిద్ధి చెందిన మహాబోధి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదే సందర్బంలో నరేంద్ర మోడీ బుద్ధుని సన్నిధిలో కొద్ది సేపు ధ్యానం చేశారు.
శనివారం గయ విమానాశ్రయంలో అంతర్జాతీయ బౌద్ధుల సంఘం కార్యదర్శి లామా లోబో జాంగ్, మహా బోధి ఆలయం వద్ద ప్రధాన అర్చకుడు భాంటీ ఛాలించా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఘనంగా స్వాగతం పలికారు.
శనివారం నరేంద్ర మోడీ బుద్ధ గయలో పర్యటించారు. రెండు రోజుల క్రితం అంతర్జాతీయ బౌద్ధల సమావేశం ఢిల్లీలో ప్రారంభం అయ్యింది. ఈ కార్యాక్రమానికి నరేంద్ర మోడీ హాజరు కాలేదు. అయితే ఈ సమావేశం ముగింపు కార్యక్రమాలు గయలో నిర్వహిస్తున్నారు.
అంతర్జాతీయ బౌద్ధల సమావేశం ముగింపు కార్యక్రమానికి హాజరుకావడానికి నరేంద్ర మోడీ గయ వచ్చారు. నరేంద్ర మోడీ పర్యటన సందర్బంగా ప్రత్యేక రక్షణ దళానికి చెందిన 16 మంది భద్రతా ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారు. ఈ సందర్బంగా గయలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.