పాస్ చేయిస్తానని విద్యార్ధినిపై ప్రిన్సిపాల్ రేప్, ఇద్దరి మహిళల సహకారం
చంఢీఘడ్:పదో తరగతి వార్షిక పరీక్షల్లో వేరే విద్యార్థితో పరీక్ష రాయించి పాస్ చేయిస్తానని నమ్మించి ఓ విద్యార్థినిపై ప్రిన్సిఫాల్ అత్యాచారానికి పాల్పడిన ఘటన పంజాబ్ రాష్ట్రంలోని సోనిపట్ జిల్లాలోని గౌహనా పట్టణంలో చోటు చేసుకొంది.
భావి భారత పౌరులను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులే విద్యార్ధుల జీవితాలతో ఆడుకొంటున్నారు. ఉపాధ్యాయ వృత్తికే కళంకం తీసుకొస్తున్నారు. పదో తరగతి వార్షిక పరీక్షల్లో పాస్ చేయిస్తామని చెప్పి విద్యార్ధినిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన పంజాబ్ రాష్ట్రంలో కలకలం రేపుతోంది.
స్కూల్ ప్రిన్సిపాల్ మాటలు నమ్మి విద్యార్ధినిని ప్రిన్సిఫాల్ ఇంటికి పంపిన తల్లిదండ్రులు ప్రస్తుతం విద్యార్ధుల తల్లిదండ్రులు ప్రిన్సిఫాల్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నగ్న చిత్రాలతో వివాహితకు బ్లాక్మెయిల్, అత్యాచారం , బుద్ది చెప్పిన భాదితురాలు
పదో తరగతి పరీక్ష్లో పాస్ చేయిస్తానని విద్యార్ధినిపై రేప్
పదో తరగగతి వార్షిక పరీక్షల్లో వేరే విద్యార్ధితో పరీక్షలు రాయించి పాస్ చేయిస్తానని నమ్మించి ఓ విద్యార్ధినిపై ప్రిన్పిఫాల్ అత్యాచారానికి పాల్పడ్డాడు. విద్యార్ధిని తల్లిదండ్రులను కూడ స్కూల్ ప్రిన్సిఫాల్ నమ్మించాడు. ప్రిన్సిఫాల్ను నమ్మిన విద్యార్ధిని తల్లిదండ్రులు విద్యార్ధినిని స్కూల్ ప్రిన్పిఫాల్ ఇంటికి తీసుకెళ్ళారు.విద్యార్ధిని తండ్రిని బయటకు పంపి రేప్ విద్యార్ధినిపై రేప్కు పాల్పడ్డాడు నిందితుడు.
పరీక్షల్లో పాస్ చేసేందుకు రూ. 10వేల ఒప్పందం
పదో తరగతి పరీక్షల్లో పాస్ చేసేందుకు విద్యార్ధిని కుటుంబసభ్యులతో ప్రిన్సిఫాల్ పదివేల రూపాయాల ఒప్పందాన్ని కూడ కుదుర్చుకొన్నాడని బాధిత విద్యార్ధిని కుటుంబసభ్యులు చెబుతున్నారు. మార్చి 8వ తేదిన విద్యార్ధినిని తీసుకుని రావాలని విద్యార్ధిని కుటుంబసభ్యులకు ప్రిన్పిఫాల్ ఫోన్ చేశారు. ప్రిన్సిఫాల్ సూచన మేరకు వెళ్ళిన తనను వెళ్ళిపోవాలని ప్రిన్సిపాల్ బయటకు పంపాడని బాధిత విద్యార్ధిని తండ్రి చెప్పాడు.
ప్రిన్సిఫాల్కు ఇద్దరి మహిళల సహకారం
పదో తరగతి విద్యార్ధినిపై అత్యాచారానికి పాల్పడిన ప్రిన్పిఫాల్కు ఇద్దరు మహిళలు కూడ సహకరించారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.ఈ మేరకు ప్రిన్సిఫాల్తో పాటు అతడికి సహకరించిన ఇద్దరు మహిళలపై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
రెండు నెలల్లో రెండో ఘటన
పంజాబ్ రాష్ట్రంలో ఈ తరహ ఘటన చోటు చేసుకోవండ రెండోది. రెండు మాసాల వ్యవధిలో ఈ తరహ ఘటన చోటు చేసుకొంది. ఈ తరహ ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్ధి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నిందితులను కఠినంగా శిక్షిస్తే భవిష్యత్లో ఈ తరహ ఘటనలు పునరావృతం కావని బాధిత కుటుంబసభ్యులు అభిప్రాయపడుతున్నారు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.