ప్రాక్టికల్ పరీక్షల్లో మార్కులు కావాలంటే కోరిక తీర్చాల్సిందే : విథ్యార్థినికి ప్రిన్సిఫాల్ లైం
రాయ్ ఘడ్ : విద్యార్థులను మంచి మార్గంలో నడపాల్సిన పవిత్ర వృత్తిలో ఉండి .. ఆ వృత్తికే కళంకం తెచ్చాడు ఓ ప్రబుద్దుడు.ప్రాక్టికల్ పరీక్షల్లో పాస్ చేయడానికి తనతో శారీరక సంబందం పెట్టుకోవాలని సాక్షాత్తు ప్రిన్సిఫాల్ వేధించిన ఘటన తలవొంపులు తెచ్చేదిగా ఉంది. ఈ ఘటన చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో చోటుచేసుకొంది.
చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని రాయ్ ఘడ్ జిల్లాలోని సరియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకొంది. సరస్వతీ శిశుమందిర్ స్కూల్ లో 12వ, తరగతి చదువుతున్న 17 ఏళ్ళ బాలికను సాక్షాత్తు స్కూల్ ప్రిన్సిఫాల్ వేధించాడు. లైంగికంగా వేధించాడు. తనకతో శారీరకంగా సంబందం పెట్టుకొంటేనే ప్రాక్టికల్ పరీక్షలో పాస్ చేస్తానని బెదిరించాడు.
బావి భారత పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులే ఈ రకంగా వ్యవహరించడం సభ్యసమాజం తలదించుకొనేదిగా ఉంది. ఈ విషయాన్ని ఆ విధ్యార్థిని ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు చెప్పింది.స్కూల్ యాజమాన్యానికి బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అయినా స్కూల్ యాజమాన్యం ప్రిన్సిఫాల్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
స్కూల్ యాజమాన్యం కూడ ప్రిన్సిఫాల్ పై ఎలాంటి చర్యలు తీసుకోని కారణంగా పోలీసులకు ఆశ్రయించారు విధ్యార్థిని తల్లిదండ్రులు.ఐపిసీ 354, పోస్కో చట్టం కింద పాఠశాళ ప్రిన్సిఫాల్ పై కేసు నమోదు చేశారు పోలీసులు.