17 ఏళ్ళ బాలుడిపై ప్రధానోపాధ్యాయురాలి లైంగిక వేధింపులు
బావి భారత పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన ఓ ప్రధానోపాద్యాయురాలు కామంతో కళ్ళు మూసుకుపోయింది. 17 ఏళ్ళ విద్యార్థిపై లైంగిక వేధింపులకు పాల్పడింది.ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటుచేసుకొంది.
పాటియాలా: బావి భారత పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన ఓ ప్రధానోపాద్యాయురాలు కామంతో కళ్ళు మూసుకుపోయింది. 17 ఏళ్ళ విద్యార్థిపై లైంగిక వేధింపులకు పాల్పడింది.ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటుచేసుకొంది.
పాటియాలా జిల్లాలోని ఓ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యయురాలే పదిహేడేళ్ళ విద్యార్థిపై లైంగికంగా వేధించింది. పాఠశాలలో చదువుకొంటున్న 17 ఏళళ్ళ విద్యార్థిని రాత్రివేళ తన ఇంట్లోనే ఉంచుకొంటుంది.
రాత్రి పూట భోజనం పెట్టి తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని వేధిస్తోందని బాథితుడి తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయురాలిపై ఫిర్యాదు చేశారు. అంతేకాదు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు.
దీంతో ఈ సంఘటనపై దర్యాప్తు జరిపిన పాఠశాల విద్యా కార్యదర్శి కిషన్కుమార్ , సర్కిల్ విద్యాధికారణి నిషా జలోభాలు బాలుడిని లైంగికంగా వేధించిన ప్రధానోపాధ్యాయురాలిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
ఈ ప్రధానోపాధ్యాయురాలు రెండేళ్ళ క్రితమ మరో స్కూల్ బాలుడితో కలిసి డ్యాన్స్ చేస్తూ వెలువడిన వీడియో అప్పట్లో సంచలనం రేపింది. ప్రధానోపాధ్యాయురాలి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందని తోటి ఉపాధ్యాయులు చెప్పారు.