వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యార్థినిని గర్భవతినిచేసిన టీచర్, రూ.50 లక్షలిచ్చి దాచాలనుకొన్నారు

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబై: భావిభారత పౌరులను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు అనైతికానికి పాల్పడుతున్నారు. కన్నబిడ్డలుగా చూడాల్సిన విద్యార్థులపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు.. ముంబైలోని ఓ పాఠశాలలో విద్యార్తిని గర్భవతిని చేసి, విషయం బయటకు రాకుండా రూ.50 లక్షలను ఇవ్వజూపిన ఘటన వెలుగుచూసింది.

ఐదు మాసాల క్రితం వివాదంలో నిలిచిన నీరుల్ ఎంజీఎం స్కూల్ మరోసారి వివాదానికి కారణమైంది. ఈ పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయుడు ఓ 15 ఏళ్ళ విద్యార్థినిని గర్భవతిని చేశాడు. అయితే ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకుగాను రూ.15 లక్షలను లంచం ఇచ్చేందుకు పాఠశాల స్కూల్ ప్రిన్సిఫాల్ ప్రయత్నించిన ఘటన వెలుగుచూసింది.

Prinicipal offered Rs.50 lakh to mother of raped student

ఈ పాఠశాలలోని హరిశంకర్ శుక్లా అనే ఉపాధ్యాయుడు 13 ఏళ్ళ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.ఆ బాలిక గర్భం దాల్చింది. దీంతో ఈ విషయాన్ని బయటకు రాకుండా చేయాలని భావించారు. పాఠశాలకు చెందిన ప్రిన్సిఫాల్ సవితా గులాటీ బాధితురాలి తల్లికి రూ.50 లక్షలను లంచం ఇవ్వజూపారనే ఆరోపణలు వచ్చాయి.

ఈ డబ్బులు తీసుకొని నోరుమూసుకొని ఉండాలని స్కూల్ ప్రిన్సిఫాల్ బాధితురాలిని బెదిరించారని బాదితురాలి కుటుంబసభ్యులు ఆరోపించారు.అంతేకాదు జరగబోయే పరిణామాలను తీవ్ర బాద్యత వహించాల్సి వస్తోందని హెచ్చరించారని సమాచారం.ఈ విషయమై సిబిఎస్ఈ ఈ ఘటనపై పాఠశాలకు షోకాజ్ నోటీసు పంపింది.

English summary
Nearly five months after Nerul’s MGM school was besieged by protests against a teacher who is alleged to have sexually assaulted many students because of which a 13-year-old got pregnant, it has emerged that the principal of the school tried to hush up the parents by offering Rs 50 lakh to the parents of the raped teen and cowing them with the threat of “connections in high places.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X