ఆరుమాసాలుగా స్కూల్లోనే విధ్యార్థినిపై అత్యాచారానికి పాల్పడుతున్న ప్రధానోపాధ్యాయుడు
కర్ణాటక రాష్ట్రంలోని పాతపాళ్యంలోని స్కూల్ ప్రధానోపాధ్యాయుడు దుగ్గప్ప అదే పాఠశాలకు చెందిన 12 ఏళ్ళ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆరుమాసాలుగా ఆమెను బెదిరించి అత్యాచారం చేస్తున్నాడు.తీవ్రమైన కడుపునొ
కర్ణాటక:భావి భారత పౌరులను తీర్చిదిద్దాల్సిన పవిత్ర ఉపాధ్యాయులు ఉండి సమాజాన్ని వక్రమార్గంలో నడిపే పనులు చేస్తున్నారు. ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలో ఓ ప్రధానోపాధ్యాయుడు బెదిరించి విధ్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆరుమాసాలుగా ప్రధానోపాధ్యాయుడు ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు.
కర్ణాటక రాష్ట్రంలోని పాతపాళ్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని పాఠశాల విధ్యార్థినిపై అదే పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయుడు దుగ్గప్ప ఆరు మాసాలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ విషయం బయటకు చెప్పకూడదని విధ్యార్థినిని బెదిరించాడు.
మైనర్ బాలిక సోమవారం సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత తీవ్రమైన కడుపుకొప్పికి గురైంది. ఆసుపత్రికి తీసుకెళ్ళగా అసలు విషయం బయటపడింది. తనను బెదిరించి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అత్యాచారం చేస్తోన్న విషయాన్ని ఆ బాలిక బయటపెట్టింది.
బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ పిర్యాదుమేరకు పోలీసులు ప్రధానోపాధ్యాయుడు దుగ్గప్పను అదుపులోకి తీసుకొన్నారు.ప్రధానోపాధ్యాయుడు విధ్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ఘటనను స్థానికులు విద్యాశాఖధికారుల దృష్టికి తీసుకెళ్ళారు. విచారణ నిర్వహిస్తున్నారు ఉన్నతాధికారులు.