వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆరుమాసాలుగా స్కూల్లోనే విధ్యార్థినిపై అత్యాచారానికి పాల్పడుతున్న ప్రధానోపాధ్యాయుడు

కర్ణాటక రాష్ట్రంలోని పాతపాళ్యంలోని స్కూల్ ప్రధానోపాధ్యాయుడు దుగ్గప్ప అదే పాఠశాలకు చెందిన 12 ఏళ్ళ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆరుమాసాలుగా ఆమెను బెదిరించి అత్యాచారం చేస్తున్నాడు.తీవ్రమైన కడుపునొ

By Narsimha
|
Google Oneindia TeluguNews

కర్ణాటక:భావి భారత పౌరులను తీర్చిదిద్దాల్సిన పవిత్ర ఉపాధ్యాయులు ఉండి సమాజాన్ని వక్రమార్గంలో నడిపే పనులు చేస్తున్నారు. ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలో ఓ ప్రధానోపాధ్యాయుడు బెదిరించి విధ్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆరుమాసాలుగా ప్రధానోపాధ్యాయుడు ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు.

కర్ణాటక రాష్ట్రంలోని పాతపాళ్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని పాఠశాల విధ్యార్థినిపై అదే పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయుడు దుగ్గప్ప ఆరు మాసాలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ విషయం బయటకు చెప్పకూడదని విధ్యార్థినిని బెదిరించాడు.

 prinicipal rape student in school

మైనర్ బాలిక సోమవారం సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత తీవ్రమైన కడుపుకొప్పికి గురైంది. ఆసుపత్రికి తీసుకెళ్ళగా అసలు విషయం బయటపడింది. తనను బెదిరించి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అత్యాచారం చేస్తోన్న విషయాన్ని ఆ బాలిక బయటపెట్టింది.

బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ పిర్యాదుమేరకు పోలీసులు ప్రధానోపాధ్యాయుడు దుగ్గప్పను అదుపులోకి తీసుకొన్నారు.ప్రధానోపాధ్యాయుడు విధ్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ఘటనను స్థానికులు విద్యాశాఖధికారుల దృష్టికి తీసుకెళ్ళారు. విచారణ నిర్వహిస్తున్నారు ఉన్నతాధికారులు.

English summary
patapalyam school principle duggappa rape a minor student last six months. he warned her dont tell this incident. student get stomach pain on monday, doctors identified girl was raped.student parents complient against the principle , police arrest priniciple duggappa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X