'నా ఆశీర్వాదంతోనే ప్రియాంక స్టార్గా ఎదిగింది'
లక్నో: సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మంగళవారం సఫాయ్ ఫెస్టివల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు. తన ఆశీస్సుల వల్లే ప్రియాంక చోప్రా బాలీవుడ్లో పెద్ద స్టార్ అయిందని ఆయన వ్యాఖ్యానించారు.
మంగళవారం ఉత్తరప్రదేశ్లోని ఇటావాలో జరిగిన సఫాయ్ ఫెస్టివల్లో పాల్గొన్న ములాయం సింగ్ యాదవ్ మాట్లాడుతూ ప్రియాంక చోప్రా ఈ ఫెస్టివల్కు మూడు సార్లు హాజరైందని చెప్పారు. బరేలీలో ప్రియాంక చోప్రా విద్యార్ధినిగా ఉన్నప్పుడు ప్రియాంక తండ్రి ఆర్మీలో పనిచేసేవారు.
'తాను ఆ సమయంలో కేంద్ర రక్షణ మంత్రిగా ఉన్నాను. అప్పుడు వారు తనను కలిశారని, ఆ సమయంలో పెద్ద హీరోయిన్ కావాలని ప్రియాంకాను నేను ఆశీర్వదించా ను. ఆ ఆశీస్సుల వల్లే ఆమె ఈ రోజు ఇంతపెద్ద స్టార్ అయింది' అని తెలిపారు. మాధురీ దీక్షిత, అమితాబ్ బచ్చన్ వంటి చాలా మంది స్టార్లను తానే సఫాయ్ పెస్టివల్కు తీసుకువచ్చానని తనను తాను పొగుడుకున్నారు.
నటించడం ఓ కళ అని, కాబట్టి హీరో, హీరోయిన్లను గౌరవించాలని ములాయం ప్రజలను కోరారు. ములాయం సింగ్ యాదవ్కు బాలీవుడ్తో చాలా అవినాభావ సంబంధం ఉంది. ప్రతి ఏడాది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా నిర్వహించే సఫాయ్ ఫెస్టివల్ కార్యక్రమానికి బాలీవుడ్ స్టార్లు హాజరవుతూనే ఉంటారు.