లక్షల ఉద్యోగులు రోడ్డుపైకి వస్తున్నారు... ఇప్పుడైన స్పందించండి.. ప్రియాంక గాంధి
ఇటివల ఆటోమొబైల్ రంగం కుదేలయింది. దీంతో పలు కంపనీలు నష్టాల్లోకి రావడంతో ఉద్యోగుల భారం తగ్గించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే చాల కంపనీలు మూతపడుతున్న పరిస్థితి. దీంతో లక్షలాది అటోమోబైల్ రంగంలోని ఉద్యోగులకు కోత విధిస్తున్నారు. గత 19 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా వాహనరంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీంతో ఇప్పటికే ఆటోమొబైల్, అనుబంధ రంగాల్లో 2.15 లక్షల ఉద్యోగాలు పోయినట్టు పలు సర్వేలు తెలుపుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఆటోమొబైల్ రంగంలో ఉద్యోగాల కోత, పలు కంపెనీల మూసివేతతో పై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పందించారు. అటోమైబైల్ రంగం సంక్షోభంలో ఉన్నప్పుడైనా కనీసం ఎన్డీఏ ప్రభుత్వం స్పందించాలని ఆమే డిమాండ్ చేశారు.లక్షలాది ఉద్యోగాలు కోల్పోతున్నా ప్రభుత్వం మాత్రం నోరు మెదపడం లేదని ఆమే మండిపడ్డారు.'ఇప్పుడు కూడా ప్రభుత్వం మౌనంగా ఉండటం ప్రమాదకరం. కంపెనీలు మూతపడుతున్నాయి. సామాన్య ప్రజల ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. అయినా ప్రభుత్వం నోరు మెదపడం లేదు. ఈ పరిస్థితికి కారణం ఎవరు?' అని ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.