ఇండియా గేట్ దగ్గర ప్రియాంక బైఠాయింపు.. రంగంలోకి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్
Recommended Video
పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలంటూ దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలకు కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తోందని ఆ పార్టీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ ప్రకటించిన గంట వ్యవధిలోనే కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ రంగంలోకి దూకారు. ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర జరుగుతున్న నిరసనలో ప్రియాంక భాగం పంచుకున్నారు. ఉద్యమకారులతో కలిసి ప్రభుత్వానికి, సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
డబ్బున్నోళ్లకు
పాస్
పోర్టులున్నాయి..
మరి
పేదలకు?
సీఏఏ,
ఎన్ఆర్సీ
చట్టాలతో
దేశంలోని
పేద
ప్రజలు
తీవ్రంగా
నష్టపోతారని
ప్రియాంక
గాంధీ
చెప్పారు.
''గత
కొద్ది
రోజులుగా
దేశవ్యాప్తంగా
ఆందోళనలు
ఎందుకు
జరుగుతున్నాయో
ఆలోచించండి.
ఈ
రెండు
చట్టాలూ
పేదలవ్యతిరేక
చట్టాలు.
డీమానిటైజేషన్(పెద్ద
నోట్ల
రద్దు)
లాగే
పేదలందరూ
క్యూలైన్లలో
నిలబడి
పౌరసత్వాన్ని
నిరూపించుకోవాల్సి
ఉంటుంది.
డబ్బున్నోళ్ల
దగ్గర
పాస్
పోర్టులుంటాయి.
పేదోళ్ల
దగ్గర
అసలు
పత్రాలే
ఉండవు.
అంతమాత్రాన
అందరినీ
దేశం
నుంచి
వెళ్లగొడతారా?''అని
ప్రియాంక
ప్రశ్నించారు.
పలు
ప్రాంతాల్లో
ర్యాపిడ్
యాక్షన్
ఫోర్స్
మోహరింపు
ఢిల్లీలో
శుక్రవారం
ఉదయం
నుంచి
ఆందోళనలు
జరిగిన
పలు
ప్రాంతాల్లో
సాయంత్రం
సమయానికి
ర్యాపిడ్
యాక్షన్
ఫోర్స్
ను
మోహరించారు.
మండీ
హౌజ్
నుంచి
ఇన్
కమ్
ట్యాక్స్
ఆఫీస్(ఐటీఓ)కు
వెళ్లే
దారిని
పోలీసులు
సీజ్
చేశారు.
జయంతర్
మంతర్
కు
ర్యాలీగా
వెళ్తున్న
పోలీసులపై
గుర్తుతెలియని
నిరసనకారులు
రాళ్లతో
దాడి
చేశారని
ప్రతిగా
వాటర్
కెనాన్లు
ప్రయోగించామని
అధికారులు
చెప్పారు.
AICC General Secretary Smt. @priyankagandhi joins protesters at India Gate on a peaceful demonstration against the unconstitutional CAA & undemocratic clampdown against citizens' Right to Protest by BJP govt. #IndiansAgainstCAA pic.twitter.com/Rr2tDFItDW
— Congress (@INCIndia) December 20, 2019