ప్రియాంక ఫోన్ హ్యాక్, దీదీ, ప్రఫుల్ పటేల్ కూడా..
కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఫోన్ హ్యాక్ చేశారని ఆ పార్టీ ఆరోపించింది. వాట్సాప్ మాల్వేర్ ద్వారా హ్యాక్ చేశారని పేర్కొన్నారు. ప్రియాంకతోపాటు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ ఫోన్లను కూడా ప్రభుత్వమే హ్యాక్ చేసిందని ఆరోపించింది. వీరిలో చాలా మంది ఉన్నారని.. దాదాపు వెయ్యి పైచిలుకు మంది ఫోన్లను హ్యాక్ చేశారని పేర్కొన్నది.
ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ప్రియాంక ఫోన్ను వాట్సాప్ ద్వారా ప్రభుత్వమే హ్యాక్ చేసిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. వాట్సాప్ మాల్వేర్ హ్యాక్ చేశారని తెలిపింది. ఈ ఘటనపై విచారణ జరుపాలని డిమాడ్ చేసింది. ఏప్రిల్లో హ్యాక్ జరిగిందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అయితే ఇజ్రాయెల్ సైబర్ సెక్యూరిటీ సంస్థం ఎన్ఎస్వో స్పైవేర్ పెగాసన్ వ్యాప్తి చేసేందుకు వాట్సాప్ సర్వర్ ఉపయోగించిందని పేర్కొన్నది. అలా 20 దేశాలకు చెందిన 1400 మంది వినియోగదారుల డేటా సేకరించిందని తెలిపింది.
1400 మంది భారత్కు చెందినవారేననే కఠోర సత్యం బయటపడింది. వీరిలో నేతలు, ఉద్యమకారులు, జర్నలిస్టులు, లాయర్లు, అధికారులు ఉన్నారనే కఠోర నిజం వెలుగులోకి వచ్చింది. అందులో ప్రియాంకగాంధీ, మమతా బెనర్జీ, ప్రపుల్ పటేల్ ఫోన్లు కూడా ఉండటం విశేషం. దీనిపైనే కాంగ్రెస్ పార్టీ అధికార బీజేపీ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తోంది. హ్యాక్పై నిష్పక్షపాత దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తోంది.