మమతా ఫోటో మార్ఫింగ్ కేసు... మమతా బెనర్జీకి క్షమాపణ చెప్పాలి సుప్రిం...
గత వారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఫోటోను నటి ప్రియాంక ఒరిజినల్ ఫోటోతో మార్ఫింగ్ చేసి ఫేస్ బుక్లో పోస్ట్ చేసి అరెస్ట్ అయినా బీజేపీ యువమోర్చ నాయకురాలు ప్రియాంక శర్మకు సుప్రిం కోర్టు కండిషనల్ బెయిల్ను మంజూర్ చేసింది.. అయితే బెయిల్ పోందిన అనంతరం ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి క్షమాపణ చెప్పాలని కోర్టు ఆదేశించింది..
కాగా కోర్టులో వాదనలు జరిగే సమయంలో ..మమతకు క్షమాపణ చెప్పడంలో ఏమైన అభ్యంతరం ఉందా అని ప్రశ్నిస్తూనే ఆమే నేరుగా మమతా బెనర్జీకి క్షమాపణ చెప్పాలని సూచించింది. ఈనేపథ్యంలోనే భావ ప్రకటన స్వేఛ్చ ఇతర హక్కులకు భంగం కల్గకూడదని వ్యాఖ్యనించింది. మరోవైపు ఆమేను ఎందుకు కస్టడీలోకి తీసుకున్నారో తెలపాలంటూ స్థానిక పోలీసులకు నోటీసులు జారీ చేసింది.
కాగా ప్రియాంక శర్మ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముఖాన్ని, నటి ప్రియంకా చోప్రా గత వారం న్యూయార్క్ మెట్ గలా లో జరిగిన ఫ్యాషన్ లో దిగిన ఒరిజన్లో ఫోటోతో మార్ఫింగ్ చేసి ఫేస్ బుక్లో పోస్ట్ చేసింది. దీంతో బీజేపీ కార్యకర్తలు ఆమే పై కేసును పెట్టారు. రంగంలోకి దిగిన స్థానిక పోలీసులు ప్రియాంక శర్మను గత శుక్రవారం ఆమేను ఇంటివద్ద నుండి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అనంతరం ఆమేకు స్థానిక కోర్టు రెండు వారాలపాటు జ్యుడిషియల్ కస్టడి విధించింది. అయితే ప్రియాంక కేవలం బీజేపీ కార్యకర్త కావడంతోనే పోలీసులు ఆమేను అరెస్ట్ చేశారని ప్రియాంకశర్మ తల్లి ఆరోపించింది..ఇది రాజకీయ కుట్రలో భాగంగానే జరిగిందని విమర్శలు చేసింది. దీనిపై బెయిల్ కోసం సోమవారం సుప్రిం కోర్టు వెళ్లడంతో నేడు వాదనలు జరిగాయి.