మోడీ సవాల్ను స్వీకరించిన తార ప్రియాంక చోప్రా
ముంబై: ప్రధాని నరేంద్ర మోడీ సవాల్ను బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా స్వీకరించారు. బహిరంగ ప్రదేశాలను శుభ్రం చేసే స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఏడాదికి వంద రోజులు పాల్గొనాలని ప్రజలకు మోడీ పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన సినీ నటులను, ప్రముఖులను ఆహ్వానించారు.
మోడీ 9 మందిని ఆహ్వానించారు. మోడీ ఆహ్వానించినవారిలో బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, కమల్ హాసన్, ప్రియాంక చోప్రా, శశిథరూర్, సచిన్ టెండూల్కర్, తారక్ మెహతా, అనిల్ అంబానీ, మృదుల సిన్హా, బాబా రాందేవ్ తదితరులు ఉన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునకు ప్రియాంక చోప్రా ట్విట్టర్లో సానుకూలంగా ప్రతిస్పందించారు. ప్రధాని చేపట్టిన కార్యక్రమానికి మద్దతు తెలిపారు. ప్రధాని విసిరిన సవాల్ను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఇదా చాల మంచి ఆలోచన అని ఆమె అననారు.
స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి తమ సహాయసహకారాలు అందించాలని ఆమె తన అభిమానులను కోరారు. మరోవైపు, అమీర్ ఖాన్ ఓ అడుగు ముందుకు వేసి ఈ కార్యక్రమానికి తాను బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.