ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఓటేసింది వీరే..? వీరిలో ఇద్దరు ప్రముఖుల పిల్లలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసేందుకు యువతరం కదిలొచ్చింది. మీ కన్నా తక్కువేం కాదని కొత్తగా ఓటు హక్కు కలిగిన వారు తరలొచ్చారు. వీరిలో ప్రియాంక వాద్రా కుమారుడు రైహన్ రాజీవ్ వాద్రా ఒకరు కాగా, మరొకరు అరవింద్ కేజ్రీవాల్ కుమారుడు పుల్కిత్ కేజ్రీవాల్. వీరిద్దరూ తొలిసారి ఓటేసి ఉద్వేగానికి గురయ్యారు.
రైహన్ రాజీవ్ వాద్రా..
ప్రియాంకగాంధీ-రాబర్ట్ వాద్రాల కుమారుడు జైహన్ రాజీవ్ వాద్రా. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఓటు వచ్చింది. తన పేరెంట్స్తో కలిసి లోది ఎస్టేట్లో గల పోలింగ్ బూత్ 114, 116లో ఓటు వినియోగించుకున్నారు. ఓటు వేశాక రైహన్ థ్రిల్కు గురయ్యారు.
Recommended Video
అనుభూతికి లోనయ్యా..
ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు వజ్రాయుధం అని రైహన్ మీడియాతో పేర్కొన్నారు. తొలిసారి ఓటేయడంతో మంచి అనుభూతి కలిగిందని చెప్పారు. ప్రతీ ఒక్కరూ ఓటు వేసేందుకు ముందుకురావాలని కోరారు. పోలింగ్ కేంద్రానికి వచ్చే వెసులుబాటు అందరికీ ఉంటుందని, విద్యార్థులకు మాత్రం ఉచితంగా తీసుకొస్తే బాగుంటుందని సూచించారు.
ఇదిగో ఓటు వేశా..
ఇటు కేజ్రీవాల్ కుమారుడు పుల్కిత్ కేజ్రీవాల్ కూడా ఫస్ట్ టైం ఓటు వేశారు. న్యూఢిల్లీ నియోజకవర్గంలోని సివిల్స్ లైన్స వద్ద తన పేరెంట్స్, సోదరితో కలిసి ఓటుహక్కును వినియోగించుకున్నారు. తర్వాత పేరెంట్స్తో కలిసి ఓటేసినట్టు మీడియాకు చూపించారు. ఫోటోలు పేరెంట్స్, సోదరి, కేజ్రీవాల్ తల్లిదండ్రులు కూడా ఉన్నారు.
విలువైనది..
ఎన్నికల్లో ప్రతీ ఒక్కరు ఓటుహక్కు వినియోగించుకోవాలని అరవింద్ కేజ్రీవాల్ సూచించారు. ఓటుహక్కు పొందిన తన కుమారుడు కూడా ఓటు వేశారని పేర్కొన్నారు. యువత అంతా భారీగా తరలొచ్చి ఓటుహక్కు వినియోగించుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు వజ్రాయుధం అని.. ప్రతీ ఒక్కరు ఓటు వేయాలని కోరారు.