రక్త పిపాసి: మూడేళ్ల చిన్నారి పీక కోసి.. రక్తం తాగబోయిన సైకో
రావడం.. రావడమే వెంట తెచ్చుకున్న బ్లేడుతో చిన్నారి గొంతుకపై దాడి చేశాడు. ఆ తర్వాత రక్తాన్ని తాగేందుకు ప్రయత్నించాడని స్థానిక ఇన్ స్పెక్టర్ నమిత తెలిపారు.
బరంపురం: జాతర్లలోనో.. ఏదైనా సామూహిక ఉత్సవాల్లోనో.. మేకను లేదా గొర్రెను గావు పట్టే దృశ్యాలు మనం చూసే ఉంటాం. పళ్లతో వాటి కుత్తుకను కొరికి రక్తమోడేలా చేసే ఆ దృశ్యాలు చూడటానికి భయానకంగానే ఉంటాయి. ఇదే తరహాలో ఓ మూడేళ్ల చిన్నారి పీక కొరికి రక్తం తాగడానికి యత్నించాడో సైకో.
ఒడిశాలోని అర్జాపల్లి సముద్ర తీరం వెంట తోటి స్నేహితులతో ఆడుకుంటోంది ఓ చిన్నారి. ఇంతలో యూ బైరాగి(33) అనే వ్యక్తి అక్కడికి వచ్చాడు. రావడం.. రావడమే వెంట తెచ్చుకున్న బ్లేడుతో చిన్నారి గొంతుకపై దాడి చేశాడు. ఆ తర్వాత రక్తాన్ని తాగేందుకు ప్రయత్నించాడని స్థానిక ఇన్ స్పెక్టర్ నమిత తెలిపారు.
కాగా, గాయపడ్డ చిన్నారి కుటుంబం యూ బైరాగి ఇంటికి సమీపంలోనే నివసిస్తుండటం గమనార్హం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరానప్పటికీ.. బైరాగి మాత్రం మానసిక రోగిలా ఉన్నాడని ఇన్ స్పెక్టర్ నమిత పేర్కొన్నారు.
పారిపోతున్న బైరాగిని గోపాల్ పూర్ పోర్టు వద్ద స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గాయపడ్డ చిన్నారి ప్రస్తుతం స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.