వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.2.41లక్షల కోట్ల రుణాల రద్దు: బ్యాంకులపై సీఎం మమత అసంతృప్తి

By Narsimha
|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: ప్రభుత్వరంగ బ్యాంకులకు చెందిన నిరర్ధక ఆస్తులను మూడేళ్ళలో రూ.2.41 లక్షల కోట్ల రుణాలను రద్దు చేయడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ విరుచుకుపడ్డారు. ఈ మేరకు తన ఫేస్‌బుక్ పోస్టులో ఈ నిర్ణయాన్ని ఆమె తప్పుబట్టారు.

ప్రభుత్వ బ్యాంకులు మూడేళ్లలో రూ.2.41 లక్షల కోట్లు రుణాలను రద్దు చేశాయి. ఈ మేరకు పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ఆర్ధిక శాఖ సహయ మంత్రి శివప్రతాప్ శుక్లా మంగళవారం నాడు రాజ్యసభలో లిఖితపూర్వకంగా ప్రకటించారు.

Public sector banks wrote off Rs 2.41 crore loan in three years, Mamata questions credit info secrecy

నిరర్ధక ఆస్తులను వసూలు కాని రుణాలను ప్రతి ఏటా బ్యాంకులు తమ బ్యాలెన్స్ షీటును తొలగించడం సాధారణ ప్రక్రియ మాత్రమేనని రాజ్యసభలో మంత్రి ప్రకటించారు.

2014 ఏప్రిల్ నుండి 2017 సెప్టెంబర్ మధ్య ఈ రుణాలను రద్దు చేసినట్టు మంత్రి ప్రకటించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు మొండి బకాయిలను రద్దు చేయడంపై బెంగాల్ సీఎం మమత బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ లెక్కలు తనను షాక్‌కు గురిచేశాయంటూ దుయ్యబట్టారు. ఓవైపు రుణాలు అందక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

రైతు రుణాలను రద్దు చేయాలని ఎన్ని విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం పట్టించుకోక పోగా బడాబాబులు తీసుకున్న రుణాలను రద్దు చేస్తారా అంటూ విమర్శించారు. ఈ రుణాలు ఎవరు తీసుకున్నారన్న విషయాన్ని కూడా మంత్రి చెప్పకపోవడంపై మండిపడిన మమతా అసలు ఇదే అతి పెద్ద కుంభకోణం కాదా అని ప్రశ్నించారు

English summary
West Bengal Chief Minister Mamata Banerjee has questioned why the Centre is not ready to disclose details of credit information by a public sector bank in Parliament.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X