విద్యార్థితో లేడీ టీచర్ రోమాన్స్: తట్టుకోలేక ఇంటిలో చెప్పిన బాలుడు, స్థానికుల దెబ్బకు !
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థితో రాసలీలలు జరుపుతున్న లేడీ టీచర్ స్థానికులకు విషయం తెలిసిందని, దాడి చెయ్యడానికి వస్తున్నారని తెలుసుకుని ఆందోళనతో మాయం అయిన ఘటన .
రాజ్బర్ (పంజాబ్): ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థితో రాసలీలలు జరుపుతున్న లేడీ టీచర్ స్థానికులకు విషయం తెలిసిందని, దాడి చెయ్యడానికి వస్తున్నారని తెలుసుకుని ఆందోళనతో మాయం అయిన ఘటన పంజాబ్ లోని రాజ్బర్ ప్రాంతంలో జరిగింది.
రాజ్బర్ ప్రభుత్వ పాఠశాలలో స్థానికంగా నివాసం ఉంటున్న 15 ఏళ్ల బాలుడు పదో తరగతి విద్యాభ్యాసం చేస్తున్నాడు. అదే స్కూల్ లో టీచర్ గా పని చేస్తున్న వివాహిత మహిళ బాలుడి మీద కన్ను వేసింది. బాలుడితో రాసలీలలు చెయ్యడానికి లేడీ టీచర్ సిద్దం అయ్యింది.
తాను రాసలీలలకు రానని బాలుడు ఎదురుతిరిగాడు. అయితే నిన్ను పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని, స్కూల్ నుంచి బయటకు పంపించేస్తానని ఆమె విద్యార్థిని బెదిరించింది. ట్యూషన్ చెబుతానని నమ్మించిన లేడీ టీచర్ బాలుడిని ఇంటికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడిందని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
లేడీ టీచర్ తో ప్రతి రోజూ శృంగారంలో పాల్గోనలేక విసిగిపోయిన బాలుడు ఇంటిలో కుటుంబ సభ్యులకు అసలు విషయం చెప్పారు. బాలుడి కుటుంబ సభ్యులు స్థానికులతో కలిసి స్కూల్ దగ్గరకు బయలుదేరారు. విషయం తెలుసుకున్న లేడీ టీచర్ వెనుక తలుపు నుంచి పరారైనారు. స్థానికులు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.