దెబ్బకు దెబ్బ .. పుల్వామాకు ప్రతీకారంగానే దాడి అని ఐఏఎఫ్ స్పష్టీకరణ
ఢిల్లీ : పీవోకే, పాకిస్థాన్ భూభాగంలో చేసిన దాడులపై భారత వాయుసేన స్పందించింది. పుల్వామా దాడులకు ప్రతీకార చర్యల్లో భాగంగానే దాడులు జరిగాయని స్పష్టంచేసింది. ప్రభుత్వ ఆదేశాలతోనే అటాక్ చేశామని వెల్లడించింది.
దాడికి ప్రతిదాడి ..
బుధవారం ఉదయం 3.30 గంటలకు మొదలైన దాడుల ప్రక్రియ అరగంట పాటు కొనసాగింది. తొలుత పీవోకేలోని బాలాకోట్ తర్వాత పాకిస్థాన్ లోని ముజఫర్ నగర్ లో భారత వాయుసేన దాడులకు దిగింది. ఇవాళ మొదలైన దాడుల ప్రక్రియ ఇప్పుడే అపుతామని చెప్పలేమని ఐఏఎఫ్ అధికారి శ్రీనివాస్ మీడియాకు తెలిపారు.
ప్రతిదాడికి యత్నం .. తిప్పికొట్టిన భారత ఆర్మీ
భారత వాయిసేన దాడులతో ప్రతిదాడికి పాపిస్థాన్ ప్రయత్నించింది. కానీ ఐఏఎఫ్ వినియోగించిన మిరాజ్ 2000 యుద్ధ విమానాల ధాటికి తట్టుకోలేమని భావించి .. మిన్నకుండిపోయింది.
మేం రెడీ .. మీరు సిద్ధమా ..?
శాంతి కోసమే ఇన్నాళ్లు ఆగామని ... ఇకపై ఉపేక్షించే పరిస్థితి లేదని రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ హుడా అన్నారు. యురీ దాడితో సర్జికల్ స్ట్రైక్ తో ధీటుగా స్పందించామని .. ఇప్పుడు మరోసారి దాడి చేసినట్టు గుర్తుచేశారు. భారత్ తో పోలిస్తే పాకిస్థాన్ శక్తి, సామర్థ్యాలు తక్కువైనందున తోకముడిచి ఊరుకోవాలని హితవు పలికారు.