పుల్వామా దాడి: పాకిస్తాన్పై భారీ యాక్షన్కు భారత్ ప్లాన్?: రాజ్నాథ్ పెద్ద హింట్
న్యూఢిల్లీ: పుల్వామా దాడి అనంతరం పాకిస్తాన్ పైన భారత్ వరుసగా చర్యలు తీసుకుంటోది. రోజుకో షాక్ అన్నట్లుగా కఠిన చర్యలు తీసుకుంటోంది. మోస్ట్ ఫేవర్డ్ నేషన్ రద్దు, దిగుమతి సరుకులపై 200 శాతం సుంకం, పలు దేశాలతో చర్చలు జరిపి పాకిస్తాన్ను ఏకాకి చేయడం, తాజాగా పాక్కు నీటిని నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకోవడం.. ఇలా సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది.
ఈ అంశాలను పక్కనపెడితే కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ పైన అతిపెద్ద యాక్షన్ తీసుకునేందుకు భారత్ సిద్ధమవుతున్నట్లుగా రాజ్నాథ్ హింట్ ఇచ్చారు. అయితే ఆ మేజర్ యాక్షన్ ఏమిటనేది తెలియాల్సి ఉంది. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు.
ప్రజల ఆశలు, అంచనాలు నెరవేర్చే సమయం వస్తుందని (పాక్ పైన ప్రతీకారాన్ని ఉద్దేశిస్తూ) వ్యాఖ్యానించారు. పుల్వామా దాడి అనంతరం దేశంలో ఎవరు కూడా ఏ కార్యక్రమంలో ఉత్సాహంగా కనిపించడం లేదని చెప్పారు. తద్వారా భారత్ ఇంకా బాధలోనే ఉందని తెలిపారు.
కానీ నేను కచ్చితంగా హామీ ఇస్తున్నాను, నేను కచ్చితమైన హామీ ఇవ్వాలనుకుంటున్నాను, ప్రజలు కోరుకుంటున్నట్లుగా ప్రతీకారం తీర్చుకునేందుకు సమయం వస్తుంది, భారతీయుల ఆలోచనలు, అంచనాలు నిజమయ్యే రోజు వస్తుంది, అందరి అంచనాలు నెరవేరుస్తాము.. అని రాజ్నాథ్ చెప్పారు.
అయితే, ప్రజల ఆలోచన ఏమిటి, ఆ సమయం ఎప్పుడు వస్తుంది, ఎలా ప్రతీకారం తీర్చుకుంటారనే అంశంపై రాజ్నాథ్ పెదవి విప్పలేదు. అయితే పాకిస్తాన్ పైన మరో గట్టి చర్యలపై రాజ్నాథ్ హింట్ ఇచ్చారని చెబుతున్నారు. కాగా, ఫిబ్రవరి 14వ తేదీన జైష్ ఏ మొహమ్మద్ సూసైడ్ బాంబర్ ఉగ్రవాది 42 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను బలి తీసుకున్న విషయం తెలిసిందే.