హఠాత్తుగా కుప్పకూలిన భారీ హోర్డింగ్: నలుగురు మృతి(వీడియో)
పుణె: మహారాష్ట్రలోని పుణె రైల్వే స్టేషన్ సమీపంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా 40 అడుగుల భారీ హోర్డింగ్ కుప్పకూలడంతో నలుగురు వ్యక్తులు మరణించారు.
సెకన్ల ముందు: ఇండోనేషియా సునామీ భయానకం(వీడియో): 1,571కి చేరిన మృతుల సంఖ్య
మృతుల్లో తన భార్య చితాభస్మాన్ని నదిలో కలిపి వస్తున్న శివాజీ పరదేశి(40) అనే వ్యక్తి కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
హోర్డింగ్ మీదపడటంతో ఐదు ఆటోలు, ద్విచక్ర వాహనాలు, కారు ధ్వంసమయ్యాయి. పలుమార్లు ఫిర్యాదులు వచ్చినప్పటికీ రైల్వే కాంట్రాక్టర్ స్పందించలేదని, ఆయనపై కేసు నమోదు చేసినట్లు డీసీపీ తెలిపారు.
#Pune illegal #hording took life of 3 common people.
— Pratik Chordiya (@ChordiyaPratik) October 6, 2018
Who is responsible for this insident.#Municipal #corporation or #police ???@ANI @PTI_News @aajtak @BJP4India @AamAadmiParty @INCIndia @PuneCityPolice #illegalhordings #Maharashtra #pune #bjp #congress #ncp @PrakashJavdekar pic.twitter.com/kfgxjaNZLH
కాగా,ఘటనపై రైల్వే శాఖ కూడా ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు మండిపడుతున్నారు.