వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్యాంకు రుణాల ఎగవేత: సీఎం అమరీందర్ సింగ్ అల్లుడిపై సిబిఐ కేసు

By Narsimha
|
Google Oneindia TeluguNews

చంఢీగడ్: సిబిఐ అధికారులు సింబోలి షుగర్స్ ఫ్యాక్టరీలోని కొందరు కీలకమైన వారిపై కేసు నమోదు చేశారు. ఈ ఫ్యాక్టరీ డీజీఎం గురుపాల్ సింగ్‌తో సహ పలువురిపై కేసులు నమోదు చేశారు. గురుపాల్ సింగ్ పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అల్లుడు.

పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సింబోలి షుగర్స్ ఫ్యాక్టరీలో డీజీఎంగా పనిచేస్తున్న గురుపాల్ సింగ్ డీజీఎంగా ఉన్న ఈ షుగర్ ఫ్యాక్టరీపై బ్యాంకు రుణాన్ని తీసుకొని ఎగవేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సుమారు 200 కోట్లను బ్యాంకు రుణాన్ని ఎగవేశారనే ఆరోపణలతో సిబిఐ కేసు దాఖలు చేసింది

Punjab CM’s son-in-law among 13 booked for bank fraud case against Simbhaoli Sugars Ltd

రెండు బ్యాంకు రుణాలను ఈ ఫ్యాక్టరీ తీసుకొందని సిబిఐ దాఖలు చేసిన ఎప్‌ఐఆర్‌లో పేర్కొంది. ఓరియంటల్ బ్యాంక్ నుండి రూ.97.85 కోట్లు, కార్పోరేట్ బ్యాంక్ నుండి రూ.110 కోట్లు రుణాలను తీసుకొని ఎగవేశారని పేర్కొంది.

ఈ విషయమై బ్యాంకు అధికారులు 2017 నవంబర్‌లో సిబిఐకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా 2018 ఫిబ్రవరిలో కేసు నమోదు చేశారు అధికారులు. గురుపాల్ తో పాటు మరో 12 మందిపై సిబిఐ కేసులు నమోదు చేసింది. సింబోలి షుగర్స్ ఫ్యాక్టరీ చైర్మెన్ గుర్మిత్ సింగ్ సహ పలువురిపై కేసులు నమోదయ్యాయి.

English summary
The Central Bureau of Investigation (CBI) has registered a case against top officials of Simbhaoli Sugars Ltd — one of the largest sugar mills in the country — including its Deputy General Manager Gurpal Singh, who is the son-in-law of Punjab Chief Minister Captain Amarinder Singh, for alleged bank loan fraud of Rs 97.85 crore and default of Rs 110 crore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X