బ్యాంకు రుణాల ఎగవేత: సీఎం అమరీందర్ సింగ్ అల్లుడిపై సిబిఐ కేసు
చంఢీగడ్: సిబిఐ అధికారులు సింబోలి షుగర్స్ ఫ్యాక్టరీలోని కొందరు కీలకమైన వారిపై కేసు నమోదు చేశారు. ఈ ఫ్యాక్టరీ డీజీఎం గురుపాల్ సింగ్తో సహ పలువురిపై కేసులు నమోదు చేశారు. గురుపాల్ సింగ్ పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అల్లుడు.
పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సింబోలి షుగర్స్ ఫ్యాక్టరీలో డీజీఎంగా పనిచేస్తున్న గురుపాల్ సింగ్ డీజీఎంగా ఉన్న ఈ షుగర్ ఫ్యాక్టరీపై బ్యాంకు రుణాన్ని తీసుకొని ఎగవేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సుమారు 200 కోట్లను బ్యాంకు రుణాన్ని ఎగవేశారనే ఆరోపణలతో సిబిఐ కేసు దాఖలు చేసింది
రెండు బ్యాంకు రుణాలను ఈ ఫ్యాక్టరీ తీసుకొందని సిబిఐ దాఖలు చేసిన ఎప్ఐఆర్లో పేర్కొంది. ఓరియంటల్ బ్యాంక్ నుండి రూ.97.85 కోట్లు, కార్పోరేట్ బ్యాంక్ నుండి రూ.110 కోట్లు రుణాలను తీసుకొని ఎగవేశారని పేర్కొంది.
ఈ విషయమై బ్యాంకు అధికారులు 2017 నవంబర్లో సిబిఐకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా 2018 ఫిబ్రవరిలో కేసు నమోదు చేశారు అధికారులు. గురుపాల్ తో పాటు మరో 12 మందిపై సిబిఐ కేసులు నమోదు చేసింది. సింబోలి షుగర్స్ ఫ్యాక్టరీ చైర్మెన్ గుర్మిత్ సింగ్ సహ పలువురిపై కేసులు నమోదయ్యాయి.