వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పంజాబ్ ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లో రెట్టింపు వేతనం పడింది, కానీ అంతలోనే!

|
Google Oneindia TeluguNews

అమృత్‌సర్: సాంకేతిక సమస్య కారణంగా పంజాబ్ రాష్ట్రంలోని పలువురు ప్రభుత్వ ఉద్యోగులకు తమకు వచ్చే వేతనానికి రెండింతలు పడింది. సమస్యను గుర్తించి ఆ తర్వాత వెనక్కి తీసుకున్నారు. రెండింతల వేతనం పడటంతో దీపావళి పండుగ సందర్భంగా ప్రభుత్వం అదనంగా వేసి ఉంటుందని అందరూ భావించారు.

కానీ అది సాంకేతిక సమస్య అని గుర్తించి అంతలోనే నీరుగారిపోయారు. కంప్యూటర్‌లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా ఉద్యోగులకు రెట్టింపు వేతనం పడిందని ఆర్థిక శాఖ కార్యదర్శి చెప్పారు. అమృత్‌సర్‌తో పాటు పంజాబ్‌లోని పలు ప్రభుత్వ ఉద్యోగులకు అక్టోబర్ నెల వేతనం పడింది. తమ వేతనం కంటె రెండింతలు పడటంతో వారు షాకయ్యారు.

Punjab government employees receive double salary due to technical glitch, have to return

ఉద్యోగులు కేవలం ఒక నెల వేతనాన్ని మాత్రమే విత్ డ్రా చేసుకోవాలని అధికారులు సూచించారు. ఉద్యోగులకు రెట్టింపు వేతనం పడిన కారణంగా కేవలం అమృత్‌సర్ జిల్లాలోనే రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు ఎక్కువ డబ్బు పడింది.

English summary
Several government employees in Amritsar were ecstatic after they found they were paid a "double salary" for the month of October, thinking that the Punjab government gave them a Diwali gift.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X