వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జమ్మూ కాశ్మీర్ లో పప్పులుడకట్లేదు: ఇక పంజాబ్ పై కన్ను.. హై అలర్ట్

|
Google Oneindia TeluguNews

చండీగఢ్: పాకిస్తాన్ సరిహద్దులకు ఆనుకుని ఉన్న పంజాబ్ కు ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందా? పుల్వామా తరహాలో ఆత్మాహూతి దాడులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయా? అంటే అవుననే చెబుతున్నాయి ఇంటెలిజెన్స్ వర్గాలు. పంజాబ్‌లో ఉగ్రదాడులు జరిగే అవకాశముందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దీనితో పంజాబ్ ప్రభుత్వం రాష్ట్రంలో హై అలర్ట్‌ ప్రకటించింది. భద్రతా దళాలను భారీగా మోహరింపజేసింది.

కాశ్మీరీ అమ్మాయిలపై బీజేపీ ఎమ్మెల్యే అసభ్యకర కామెంట్స్: వారిని పెళ్లాడాలని తెగ ఉబలాటంగా ఉందట!కాశ్మీరీ అమ్మాయిలపై బీజేపీ ఎమ్మెల్యే అసభ్యకర కామెంట్స్: వారిని పెళ్లాడాలని తెగ ఉబలాటంగా ఉందట!

జమ్ము కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ను రద్దు చేసిన అనంతరం పాకిస్తాన్‌ ప్రోత్సాహిత, ఆ దేశాన్ని కేంద్రబిందువుగా చేసుకుని సరిహద్దుల్లో యథేచ్ఛగా తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్న జైషె మహమ్మద్, లష్కర్‌-ఎ-తొయిబా వంటి ఉగ్రవాద సంస్థలు ఆత్మాహూతి దాడులు పాల్పడే ప్రమాదం ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి.

 Punjab government steps up security after threat of attack by JeM, LeT terrorists

జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో వారం రోజుల వ్యవధిలో సుమారు 12 మందికి పైగా ఉగ్రవాదులు సరిహద్దులను దాటుకుని భారత భూభాగంపైకి చొరబడటానికి చేసిన ప్రయత్నాలను ఉదహరిస్తున్నాయి. భారత్‌, పాకిస్తాన్‌ సరిహద్దుల్లో ఉగ్రవాదుల కదలికలు పెద్ద ఎత్తున చోటు చేసుకుంటున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి.

 Punjab government steps up security after threat of attack by JeM, LeT terrorists

జమ్మూ కాశ్మీర్ లో వేల సంఖ్యలో అదనపు భద్రతా బలగాలు మోహరించి ఉన్న నేపథ్యంలో.. ప్రస్తుతం ఉగ్రవాదుల దృష్టి పంజాబ్ పై పడిందని, ఈ క్రమంలో వారు సరిహద్దులను దాటుకుని భారత్ లో చొరబడటానికి ప్రయత్నాలు చేయవచ్చని హెచ్చరించాయి.

దీనితో పంజాబ్ ప్రభుత్వం హై అలర్ట్ ను ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్ సహా పాకిస్తాన్ సరిహద్దుల్లో పెద్ద ఎత్తన తనిఖీలు నిర్వహిస్తోంది. జమ్మూ కాశ్మీర్ వైపు నుంచి పంజాబ్ కు దారి తీసే అన్ని మార్గాల వద్ద చెక్ పోస్టులను బలోపేతం చేసింది. అదనపు బలగాలను మోహరింపజేసింది.

English summary
The Punjab government has issued a high alert in the wake of renewed terror threat after abrogation of Article 370 leading to tense situation in Jammu and Kashmir. Security has been stepped up across the state, with senior police officials monitoring the situation in different zones. As per the information received by the state government, Pakistan-based terrorists from groups like Jaish-e-Mohammad and Lashkar-e-Taiba may carry out suicide attacks in Punjab.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X