వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పంజాబ్ హైకోర్టు సంచలన తీర్పు.. దోషి నుంచి బాధితురాలికి 90 లక్షల పరిహారం
చండీఘడ్ : పంజాబ్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దోషికి తగిన బుద్ధి చెప్పింది. అత్యాచారం కేసులో విచారణ ఎదుర్కొంటున్న నిషాన్ సింగ్ కు షాక్ ఇచ్చింది. ఫరీద్ కోట్ జిల్లాకు చెందిన మైనర్ బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసిన ఘటనలో అతడు నిందితుడు. విచారణలో నిజనిజాలు తెలుసుకున్న న్యాయస్థానం.. నిషాన్ సింగ్ కు జీవిత ఖైదు విధించింది. అతడికి చెందిన మూడున్నర ఎకరాల వ్యవసాయ భూమిని అమ్మి.. బాధితురాలికి న్యాయం చేయాలని ఆదేశించింది.
కోర్టు తీర్పుతో రంగంలోకి దిగిన జిల్లా అధికారులు ఆ భూమిని అమ్మేందుకు వేలం పాట నిర్వహించారు. రెడ్ క్రాస్ సొసైటీ దాదాపు 90 లక్షలకు వేలం పాడి ఆ పొలం దక్కించుకుంది. దీంతో బాధితురాలైన మైనర్ బాలికకు 50 లక్షల రూపాయలు, ఆమె తల్లికి 20 లక్షలు, తండ్రికి 20 లక్షలు అందించారు.
Comments
English summary
The Punjab High Court issued a sensational verdict. The shock was given to Nishan Singh, who is facing trial in the rape case. Court ordered that sell his land and give that amount to victim.
Story first published: Wednesday, December 12, 2018, 9:54 [IST]