దారుణం: మహిళా రిటైర్డ్ ఎస్ఐపై సామూహిక అత్యాచారం
ఛండీగఢ్: పంజాబ్ రాష్ట్రంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ రిటైర్డ్ మహిళా ఎస్సైపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్పూర్లో చోటు చేసుకుంది.
రైల్వే పోలీసు ఎస్సైగా పనిచేసి రిటైరైన మహిళా అధికారి(50) జమ్మూలోని వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించేందుకు బయలుదేరారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో అమె ఫిరోజ్పూర్లో చిక్కుకుపోయారు. స్థానిక జీఆర్పీ పోలీసుల సాయంతో షెల్టర్ హోంలో ఆశ్రయం పొందుతున్నారు.
ఈ క్రమంలో ఆమెపై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో ఈ దారుణానికి తెగబడ్డారు. మే 1న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు ఫిరోజ్పూర్ పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైల్వే ఉద్యోగి అయిన ఆమె భర్త మరణించడంతో ఆమెకు జీఆర్పీలో ఉద్యోగం వచ్చినట్లు సమాచారం. కాగా, సబ్ ఇన్స్పెక్టర్ హోదాలో ఆమె సర్వీస్ నుంచి రిటైర్ అయినట్లు తెలిసింది.
ఇటీవలే లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని అడ్డుకునేందుకు యత్నించిన పోలీస్ ఆఫీసర్ చేయి నరికేసిన ఘటన మరువక ముందే పంజాబ్ రాష్ట్రంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకోవడం విచారకరం.