వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పంజాబ్‌లో దారుణం : తన కుటుంబానికి చెందిన ఐదుగురిని కాల్చిన వ్యక్తి , అనంతరం ఆత్మహత్య

|
Google Oneindia TeluguNews

మోగా: పంజాబ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని అదే కుటుంబ సభ్యుడు కాల్చి చంపిన ఘటన కలకలం సృష్టించింది. మోగా జిల్లా నాథూవాల్ గ్రామంలో శుక్రవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. సందీప్ సింగ్ అనే వ్యక్తి తన నాణమ్మ, తండ్రి, తల్లి, సోదరి, ఆమె మూడేళ్ల బాలికను తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇదిలా ఉంటే సందీప్ తాతకు బుల్లెట్ దూసుకెళ్లడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.

తన కుటుంబ సభ్యులను కాల్చేందుకు వాడిన తుపాకీని తాను వేరే దగ్గరనుంచి దొంగలించినట్లు పోలీసులు చెప్పారు. ఇక కుటుంబ సభ్యులను కాల్చిన తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఓ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు సందీప్. తమ కుటుంబంకు కాదని దూరపు బంధువులకు తన తాత భూమి రాసిచ్చాడనే కోపంతో అందరినీ చంపుతున్నట్లు సూసైడ్ నోట్‌లో రాశాడు. కేవలం ఆవేశంలోనే అందరిని కాల్చేసి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇక తీవ్రగాయాల పాలైన సందీప్ తాత గురుచరణ్ సింగ్ ఫరీద్‌కోట్‌లోని గురుగోబింద్ సింగ్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Punjab youngster kills five members of a family, then shoots himself

అరైన్‌వాలా అనే గ్రామంలో నివాసముంటున్న తన బంధువుల ఇంటినుంచి తుపాకీ దొంగతనం చేసినట్లు సందీప్ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడని గ్రామ సర్పంచ్ జగ్సీర్ సింగ్ చెప్పారు. ఆ గ్రామంలో సందీప్ కుటుంబం మంచి ఆస్తులున్న కుటుంబంగా గుర్తింపు పొందింది. వారికి 25 ఏకరాల భూమి, గ్రామం మధ్యలో పెద్ద భవంతి ఉంది. కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ ఘటనతో ఆ గ్రామం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఒకే కుటుంబంకు చెందిన ఐదు మందిని అందులో మూడేళ్ల చిన్నారిని కూడా అత్యంత పాశవికంగా కాల్చి చంపడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

English summary
A man killed five members of his family, including his three-year-old niece, before committing suicide in Punjab, police said on Saturday.The incident took place at Nathuwal village near Moga on Friday night, a police official said.Sandeep Singh, 27, allegedly shot dead his grandmother, father, mother, sister and her three-year-old daughter and later shot himself, the official said. Only his grandfather survived the attack; he is being treated at a hospital, they said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X