ఐఆర్సీటీసీ స్కాం: లాలూ భార్య రబ్రీదేవి, తేజస్వి యాదవ్కు బెయిల్
న్యూఢిల్లీ: రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీ దేవికి, వారి కుమారుడు తేజస్వి యాదవ్కు ఐఆర్సీటీసీ కుంభకోణం కేసులో బెయిల్ లభించింది. ఢిల్లీ కోర్టు శనివారం వీరిద్దరికి సాధారణ బెయిల్ మంజూరు చేసింది.
ఐఆర్సీటీసీ కుంభకోణంపై సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ కూడా నిందితుడిగా ఉన్నారు. సీబీఐ, ఈడీ దాఖలు చేసిన కేసుల్లో విచారణ నిమిత్తం లాలూ ప్రసాద్ను నవంబరు 19న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరచాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది.

ఐఆర్సీటీసీ హోటళ్ల నిర్వహణకు సంబంధించి అక్రమాలకు పాల్పడ్డారని, హోటళ్ల నిర్వహణ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారని ఆరోపణలతో సీబీఐ వీరిపై కేసులు నమోదు చేసింది. ఐఆర్సీటీసీలో ఈ అక్రమాలు 2006 జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
శనివారం ఉదయం ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో జరిగిన విచారణకు రబ్రీ దేవి, తేజస్వి యాదవ్ హాజరయ్యారు. ఈ కేసులో లాలూ, రబ్రీ దేవి, తేజస్వితో పాటు ఆర్జేడీ నేత పీ.సీ గుప్తా, ఆయన భార్య సరళా గుప్తా, మరికొందరు నిందితులుగా ఉన్నారు. వీరిపై ఏప్రిల్ 16న సీబీఐ ఛార్జీ షీటు నమోదు చేసింది. లాలూ, రబ్రీ, తేజస్వి, ఇతర నిందితులకు వ్యతిరేకంగా ఆధారాలున్నాయని తెలిపింది.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications