ఐఆర్సీటీసీ స్కాం: లాలూ భార్య రబ్రీదేవి, తేజస్వి యాదవ్కు బెయిల్
న్యూఢిల్లీ: రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీ దేవికి, వారి కుమారుడు తేజస్వి యాదవ్కు ఐఆర్సీటీసీ కుంభకోణం కేసులో బెయిల్ లభించింది. ఢిల్లీ కోర్టు శనివారం వీరిద్దరికి సాధారణ బెయిల్ మంజూరు చేసింది.
ఐఆర్సీటీసీ కుంభకోణంపై సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ కూడా నిందితుడిగా ఉన్నారు. సీబీఐ, ఈడీ దాఖలు చేసిన కేసుల్లో విచారణ నిమిత్తం లాలూ ప్రసాద్ను నవంబరు 19న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరచాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది.

ఐఆర్సీటీసీ హోటళ్ల నిర్వహణకు సంబంధించి అక్రమాలకు పాల్పడ్డారని, హోటళ్ల నిర్వహణ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారని ఆరోపణలతో సీబీఐ వీరిపై కేసులు నమోదు చేసింది. ఐఆర్సీటీసీలో ఈ అక్రమాలు 2006 జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
శనివారం ఉదయం ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో జరిగిన విచారణకు రబ్రీ దేవి, తేజస్వి యాదవ్ హాజరయ్యారు. ఈ కేసులో లాలూ, రబ్రీ దేవి, తేజస్వితో పాటు ఆర్జేడీ నేత పీ.సీ గుప్తా, ఆయన భార్య సరళా గుప్తా, మరికొందరు నిందితులుగా ఉన్నారు. వీరిపై ఏప్రిల్ 16న సీబీఐ ఛార్జీ షీటు నమోదు చేసింది. లాలూ, రబ్రీ, తేజస్వి, ఇతర నిందితులకు వ్యతిరేకంగా ఆధారాలున్నాయని తెలిపింది.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications