రాఫెల్: వైమానిక దళంలో అధికారికంగా చేరనున్న 5 యుద్ధ విమానాలు..
భారత వైమానిక దళంలో రాఫెల్ యుద్ధ విమానాలు నేడు చేరబోతున్నాయి. డ్రాగన్ చైనా, ఇటు పాకిస్తాన్ కవ్వింపు చర్యలతో ఫ్రాన్స్ నుంచి ఐదు యుద్ధ విమానాలను భారత్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇవీ జూలై 29వ తేదీన భారత్ రాగా.. గురువారం వైమానిక దళంలో అధికారికంగా చేరబోతున్నాయి.
రాఫెల్ యుద్ధ విమానాలు వైమానిక దళంలో అధికారికంగా చేరబోతున్న క్రమంలో ప్రాన్స్ రక్షణశాఖ మంత్రి ఫ్లోరెన్స్ పార్లే రాబోతున్నారు. రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో సమావేశమవుతారు. ఐదు రాఫెల్ ఫైటర్ జెట్స్ హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్లో జూలై 29వ తేదీన ల్యాండయ్యాయి.
Recommended Video
నాలుగేళ్ల క్రితం భారత ప్రభుత్వం 36 అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాల కోసం ఫ్రాన్సుతో రూ.59 వేల కోట్ల కొనుగోలు అగ్రిమెంట్ కుదుర్చుకుంది. మొదటి విడత ఫ్రాన్సులోని మెరిగ్నాక్ వైమానిక కేంద్రం నుంచి 5 రఫేల్ యుద్ధ విమానాలు బయలుదేరాయి. ఇవి పంజాబ్లోని అంబాలా వైమానిక స్థావరానికి చేరుకున్నాయి.